విద్యాశాఖలో లోకేష్ అన్న విప్లవాత్మకమైన మార్పులు – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

0
8

విద్యాశాఖలో లోకేష్ అన్న విప్లవాత్మకమైన మార్పులు – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం, అగ్రహారం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు దాతల సహకారంతో 35 సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతూ, విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు అభినందనలు తెలిపారు. విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, విద్యార్థులను ఉన్నత విలువలతో తీర్చిదిద్దుతున్నారని అన్నారు.

పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థినులకు అవసరమైన సైకిళ్లను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ లక్ష్మీ తెలిపారు.

విద్యార్థినులకు 35 సైకిళ్లను దాతలు దేవినేని కోటేశ్వరరావు, కంచుమాటి శ్రీనివాసరావు, దిరిశాల శ్రీనివాసరావు, రాజా గార్లు అందించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సోమేపల్లి శ్రీను, మాజీ జడ్పీటీసీ కొక్కెర నాగరాజు, మండల టీడీపీ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు.
  Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు...
By Pagadala Venkateswar 2026-03-10 08:53:16 0 158
Technology
US and Philippines Fast-Track 4,000-Acre AI Hub
The United States and the Philippines are rapidly advancing plans to construct a massive...
By Dunna Jessicaruth 2026-05-18 12:06:07 0 85
Kerala
Vizhinjam Port Expansion: India’s Longest Container Berth
Construction at the Vizhinjam International Seaport has reached an ambitious new phase as the...
By Lokeshwari Panthadi 2026-06-29 05:52:29 0 49
Andhra Pradesh
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో ప్రసాదాల పంపిణీ
*ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వద్ద ప్రసాదాలు పంపిణీ*...
By Rajini Kumari 2025-12-30 12:27:45 0 195
Andhra Pradesh
విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజా దర్బార్
*Press Release*   *విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్*   *ప్రజలను...
By Rajini Kumari 2025-12-16 09:38:25 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com