Somu Veerraju: శాసనమండలిలో సోము వీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు... సభ రేపటికి వాయిదా.

0
100

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం

చర్చ అనంతరం మరో ప్రశ్నపై మాట్లాడేందుకు సిద్ధమైన సోము వీర్రాజు

వీర్రాజుపై దాడికి యత్నించిన వైసీపీ సభ్యులు

 

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఈరోజు రణరంగాన్ని తలపించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చెలరేగిన వివాదం చివరకు తోపులాట వరకు వెళ్లడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ముగిసిన తర్వాత, ఈ అంశంపై మరింత చర్చ జరపాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టడంతో గందరగోళం మొదలైంది. అయితే, మంత్రి వివరణ పూర్తయిందని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ మోషేనురాజు... తదుపరి ప్రశ్నకు అవకాశం కల్పించారు. ఈ తరుణంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడేందుకు ప్రయత్నించగా... వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు.

 

 

తమ నిరసన కొనసాగుతుండగానే సోము వీర్రాజుకు మైక్ ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ తదితరులు ఒక్కసారిగా వీర్రాజు సీటు వైపు దూసుకెళ్లారు. కేవలం వాగ్వాదానికే పరిమితం కాకుండా, ఆయనపై దాడికి యత్నించడంతో సభలో కలకలం రేగింది. పరిస్థితి విషమిస్తుండటంతో అప్రమత్తమైన మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ వెంటనే సోము వీర్రాజుకు అండగా నిలబడి, వైసీపీ సభ్యులను అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరగడం, సభ్యులు ఒకరిపై ఒకరు దూసుకురావడంతో సభ నియంత్రణ తప్పింది. ఈ క్రమంలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఛైర్మన్ మోషేనురాజు సభను రేపటికి వాయిదా వేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: మామిడి చెట్లను ధ్వంసం చేసిన ఏనుగు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, రాయవారిపల్లి పంచాయతీలో ఆదివారం ఒక ఏనుగు మామిడి చెట్లను...
By Kothuru Murali 2026-05-17 16:52:39 0 37
Andhra Pradesh
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*అనకాపల్లి*   • స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Rajini Kumari 2025-12-20 13:18:10 0 157
Andhra Pradesh
విధ్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నికి అహుతి అయిన ఇల్లు - సర్వం కోల్పోయిన కుటుంబం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె.అన్నవరం గ్రామంలో కుటుంబ సభ్యులతో నివాసం...
By BABJI DADALA 2025-12-25 08:21:11 0 328
Telangana
High court zone in rajendranagar
రాజేంద్రనగర్‌లో తెలంగాణ కొత్త హైకోర్టు జోన్-II భవన సముదాయాలకు శంకుస్థాపనలో సుప్రీంకోర్టు...
By G k Nookala 2026-04-05 06:12:41 0 167
Andhra Pradesh
పూలు నియోజకవర్గ :ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఒంటరి ఏనుగు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు...
By Kothuru Murali 2026-02-18 07:34:00 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com