చీరాలలో ఘనంగా ప్రింటర్స్ డే వేడుకలు

0
180

చీరాల:  ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని ముద్రణ రంగంలో వృద్దిలోకి రావాలని పలువురు సీనియర్ ప్రింటింగ్ రంగ ప్రతినిధులు పేర్కొన్నారు. ముద్రణ యంత్రం రూపొందించిన జోహాన్ఎస్ గూటెన్ బర్గ్ జయంతి సందర్బంగా ప్రింటర్స్ వేడుకలు మంగళవారం నిర్వహించారు.  ముందుగా జెండా ఆవిష్కరణ చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రముఖుల విగ్రహాలుకు పూల మాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రోటరీ కమ్యూనిటీ హాలులో సభను నిర్వహించడం జరిగింది. ముద్రణ రంగంలో పని చేసి మరణించిన పలువురికి నివాళులు అర్పించారు. ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీ ని అంది పుచ్చుకొని ఆర్ధికంగా ఎదగాలన్నారు. ముద్రణ రంగం పై ఎంతో మంది ఆధార పడి ఉపాధి పొందుతున్నారని అన్నారు. అక్షరం పేర్చే స్థాయి నుంచి ఏఐ స్థాయి వరకు ప్రింటింగ్ రంగం పెరిగిందన్నారు. అందరు ఐక్యత గా ఉండి ప్రింటింగ్ రంగాన్ని అభివృద్ధికి పాటుపడాలాన్నారు. అనంతరం శివ శంకర్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అధినేత అచ్చుల నాగేశ్వరావు ను ఘనంగా సత్కరించుకున్నారు. లక్కీ డిప్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు నక్కల శ్రీనివాసరావు, కార్యదర్శి అరవింద్, కోశాధికారి కొణిజేటి నాగేశ్వరరావు, ప్రింటింగ్ ప్రెస్, బైండర్స్, ఫ్లెక్స్ ప్రింట్రర్స్, డీటీపీ ఆపరేటర్స్ తదితరులు ఎంతో ఉత్సహంగా పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
మీరు "ఇస్తామంటే  మేము వద్దంటామా "
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను 3...
By Ponnala Srinivasrao 2026-03-12 13:30:08 0 287
Telangana
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...
By Sadaq Sadaq 2026-03-02 14:43:56 0 152
Andhra Pradesh
ప్రజాసేవలో అంకితభావంతో మంత్రి నారా లోకేష్
*ప్రజాసేవలో అంకితభావంతో మంత్రి నారా లోకేష్*   *విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులతో...
By Rajini Kumari 2026-01-23 11:53:18 0 210
Andhra Pradesh
Boyakonda: ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల అభిషేకం, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ.
Boyakonda: శ్రీ బోయకొండ గంగమ్మకు వైభవంగా అభిషేకం ప్రత్యేక పూజలు   శక్తి స్వరూపిణి శ్రీ...
By Pagadala Venkateswar 2026-07-11 04:09:12 0 60
Andhra Pradesh
పుంగనూరు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం మధ్యాహ్నం పుంగనూరు పట్టణంలో పర్యటించారు. మదనపల్లె...
By Kothuru Murali 2026-01-01 05:36:12 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com