చీరాలలో ఘనంగా ప్రింటర్స్ డే వేడుకలు

0
150

చీరాల:  ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని ముద్రణ రంగంలో వృద్దిలోకి రావాలని పలువురు సీనియర్ ప్రింటింగ్ రంగ ప్రతినిధులు పేర్కొన్నారు. ముద్రణ యంత్రం రూపొందించిన జోహాన్ఎస్ గూటెన్ బర్గ్ జయంతి సందర్బంగా ప్రింటర్స్ వేడుకలు మంగళవారం నిర్వహించారు.  ముందుగా జెండా ఆవిష్కరణ చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రముఖుల విగ్రహాలుకు పూల మాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రోటరీ కమ్యూనిటీ హాలులో సభను నిర్వహించడం జరిగింది. ముద్రణ రంగంలో పని చేసి మరణించిన పలువురికి నివాళులు అర్పించారు. ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీ ని అంది పుచ్చుకొని ఆర్ధికంగా ఎదగాలన్నారు. ముద్రణ రంగం పై ఎంతో మంది ఆధార పడి ఉపాధి పొందుతున్నారని అన్నారు. అక్షరం పేర్చే స్థాయి నుంచి ఏఐ స్థాయి వరకు ప్రింటింగ్ రంగం పెరిగిందన్నారు. అందరు ఐక్యత గా ఉండి ప్రింటింగ్ రంగాన్ని అభివృద్ధికి పాటుపడాలాన్నారు. అనంతరం శివ శంకర్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అధినేత అచ్చుల నాగేశ్వరావు ను ఘనంగా సత్కరించుకున్నారు. లక్కీ డిప్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు నక్కల శ్రీనివాసరావు, కార్యదర్శి అరవింద్, కోశాధికారి కొణిజేటి నాగేశ్వరరావు, ప్రింటింగ్ ప్రెస్, బైండర్స్, ఫ్లెక్స్ ప్రింట్రర్స్, డీటీపీ ఆపరేటర్స్ తదితరులు ఎంతో ఉత్సహంగా పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా పదవ తరగతి ఉత్తీర్ణతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 16, 2025*...
By Rajini Kumari 2025-12-16 12:32:42 0 264
International
PM Narendra Modi held wide-ranging talks with President John Dramani Mahama of Ghana at the iconic Jubilee House, Ghana......
Both leaders reaffirmed the warm and time-tested ties between 🇮🇳 & 🇬🇭, and discussed ways to...
By Bharat Aawaz 2025-07-03 07:24:41 0 2K
Telangana
మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.|
హైదరాబాద్ : సభలో బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సమాయత్తం కావాలి.  జిల్లాల...
By Sidhu Maroju 2025-12-29 13:02:16 0 152
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు
తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత అమరావతి...
By Benguluri Madhubabu 2026-04-02 14:15:41 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com