చీరాలలో ఘనంగా ప్రింటర్స్ డే వేడుకలు

0
178

చీరాల:  ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని ముద్రణ రంగంలో వృద్దిలోకి రావాలని పలువురు సీనియర్ ప్రింటింగ్ రంగ ప్రతినిధులు పేర్కొన్నారు. ముద్రణ యంత్రం రూపొందించిన జోహాన్ఎస్ గూటెన్ బర్గ్ జయంతి సందర్బంగా ప్రింటర్స్ వేడుకలు మంగళవారం నిర్వహించారు.  ముందుగా జెండా ఆవిష్కరణ చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రముఖుల విగ్రహాలుకు పూల మాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రోటరీ కమ్యూనిటీ హాలులో సభను నిర్వహించడం జరిగింది. ముద్రణ రంగంలో పని చేసి మరణించిన పలువురికి నివాళులు అర్పించారు. ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీ ని అంది పుచ్చుకొని ఆర్ధికంగా ఎదగాలన్నారు. ముద్రణ రంగం పై ఎంతో మంది ఆధార పడి ఉపాధి పొందుతున్నారని అన్నారు. అక్షరం పేర్చే స్థాయి నుంచి ఏఐ స్థాయి వరకు ప్రింటింగ్ రంగం పెరిగిందన్నారు. అందరు ఐక్యత గా ఉండి ప్రింటింగ్ రంగాన్ని అభివృద్ధికి పాటుపడాలాన్నారు. అనంతరం శివ శంకర్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అధినేత అచ్చుల నాగేశ్వరావు ను ఘనంగా సత్కరించుకున్నారు. లక్కీ డిప్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు నక్కల శ్రీనివాసరావు, కార్యదర్శి అరవింద్, కోశాధికారి కొణిజేటి నాగేశ్వరరావు, ప్రింటింగ్ ప్రెస్, బైండర్స్, ఫ్లెక్స్ ప్రింట్రర్స్, డీటీపీ ఆపరేటర్స్ తదితరులు ఎంతో ఉత్సహంగా పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో పర్యటించిన స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో శనివారం స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు కేజీ పద్మలత, జిల్లా...
By Kothuru Murali 2026-04-05 07:43:50 0 162
Tamilnadu
Tamil Nadu's Industrial Growth and Investment Momentum
Tamil Nadu continues to strengthen its position as one of India's leading industrial destinations...
By Fathima Safa 2026-06-20 06:29:43 0 103
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరు పట్టణంలో ఇంటింటికీ బీసీ చైతన్యం కార్యక్రమం
పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో 'ఇంటింటికీ బీసీ చైతన్యం' కార్యక్రమం సోమవారం...
By Kothuru Murali 2026-03-31 04:21:10 0 156
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్‌ను కలిసిన హజ్ కమిటీ సభ్యులు.
రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, ఇతర సభ్యులు...
By Pagadala Venkateswar 2026-02-11 06:00:20 0 147
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు...
By Kothuru Murali 2026-03-06 11:43:05 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com