ప్రత్తిపాడులో ఉద్యమి సభ్యత్వాలకు వేగం – అధినేత ఆదేశాలు, నేతల సమన్వయం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబీ) తెలిపారు. మంగళవారం అధినేతను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా నియోజకవర్గంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆయనతో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్తిపాడు ప్రాంత అభివృద్ధి అంశాలపై ప్రత్యేకంగా విచారించినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని, అదే సమయంలో పార్టీ బలోపేతానికి ఉద్యమి సభ్యత్వ నమోదు కీలకమని సూచించినట్లు బాబీ వెల్లడించారు.
జనసేన పార్టీ ప్రారంభించిన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం కేవలం సభ్యత్వ నమోదు మాత్రమే కాకుండా, పార్టీ కార్యకర్తల భద్రత, కుటుంబాల సంక్షేమం, మరియు భవిష్యత్ నాయకత్వ నిర్మాణానికి దోహదపడే కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. జనసైనికులు, వీరమహిళలకు అండగా నిలిచి వారిని కొత్తతరం నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.
జిల్లా స్థాయిలో ఉద్యమి సభ్యత్వాల ఇంచార్జ్గా ఉన్న పార్లమెంట్ సభ్యులు తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ సూచనల మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేపట్టి ప్రతి గ్రామం, ప్రతి వార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చురుకుగా నిర్వహించనున్నట్లు బాబీ తెలిపారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులు తదితర వర్గాల నుండి విస్తృత స్పందన తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు.
అలాగే పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు అన్వేషించడం వంటి అంశాలను ఉద్యమి సభ్యత్వ కార్యక్రమంతో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఉద్యమి సభ్యత్వాలు కీలక భూమిక పోషిస్తాయని, అధినేత ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబీ) స్పష్టం చేశారు. #dadala babji
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz