జై సాధువుల ఆశీస్సులు పొందిన ఎంపీ కేశినేని శివనాద్

0
176

*ప్ర‌చుర‌ణార్ధం* *23-02-2026*

 

*జైన్ సాధువుల ఆశీస్సులు పొందిన ఎంపీ కేశినేని శివనాథ్*

 

*జైన్ తేరాపంత్ భవన్ కు జైన్ సాధువులు రష్మీమునిశ్రీ, శివయుష్ మునిశ్రీ రాక‌*

 

విజయవాడ: గురునానక్ కాలనీలోని జైన్ తేరాపంత్ భవన్‌కు విచ్చేసిన జైన్ తేరాపంత్ ఆచార్య మహాశ్రమణ్ శిష్యులు రష్మీమునిశ్రీ, శివయుష్ మునిశ్రీలను సోమ‌వారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు.

 

రాజస్థాన్ నుంచి దేశ‌వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ విజయవాడకు చేరుకున్న జైన్ సాధువులను ఎంపీ కేశినేని శివ‌నాథ్ జైన్ తేరాపంత్ భవన్‌లో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాధువులు అహింస, సద్గుణాలు, దురాలవాట్ల నివారణపై ఆధ్యాత్మిక బోధనలు అందించారు.

 

ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువల పెంపొందనకు జైన్ సాధువుల సేవలు ఎంతో విలువైనవని తెలిపారు. వారి పాదయాత్రలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంచుతున్నాయని కొనియాడారు.

 

ఈ కార్యక్రమంలో జైన్ సమాజ ప్రముఖులు దినేష్ జైన్, శ్యామ్ సుఖా, జగదీష్ జైన్, మనోజ్ పుగ్లియా, రాజ్‌కుమార్ బైడ్, సంగీత దుగర్, సందీప్ కోఠారి, టిడిపి నాయ‌కులు పీతా బుజ్జిల‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మా వందే చిత్రం నుంచి కొత్త అప్డేట్..
మా వందే  మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్ర చిత్రం మా వందే టైటిల్ అందరికీ...
By Yadamma Raju Gajapaga 2026-01-19 15:03:14 0 529
Andhra Pradesh
దళిత, క్రైస్తవ సోదరుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటాం
దళిత, క్రైస్తవ సోదరుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటాం... ఈరోజు...
By Chennaiah Kati 2026-07-03 13:00:49 0 47
Madhya Pradesh
CM Mohan Yadav Enforces Strict Action After Dewas Tragedy
Following the tragic explosion at a firecracker factory in Dewas, the death toll rose to five...
By Dunna Jessicaruth 2026-05-15 05:24:14 0 214
Andhra Pradesh
పుంగనూరు: హెల్మెట్ ధరించి వాహనాల నడుపుతున్న వారికి అభినందనలు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, డిఎస్పి మహేంద్ర...
By Kothuru Murali 2026-01-21 10:38:47 0 182
Telangana
కుత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో పనులు సకాలంలో జరగడం లేదు. ఆరోపించిన ఎన్జీవో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి.
కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయం లో గత రెండు నెలల నుండి అధికారులు కుల దృవీకరణ పత్రాలు సకాలంలో...
By Sidhu Maroju 2025-06-11 15:16:37 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com