కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం గద్దె క్రాంతి కుమార్

0
170

*కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం*

 

      *టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్*

 

 

            పార్టీకి ప్రాణం, నాయకత్వానికి బలం కార్యకర్తలని బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ జెండాను గర్వంగా ఎగరేసేది, ప్రజల మధ్య పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లేది కార్యకర్తలేనని అటువంటి తాము ఎప్పుడు అండగా ఉంటామని టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు.

 

            సోమవారం ఉదయం 19వ డివిజన్ జార్జిపేట ఏరియాలో గద్దె క్రాంతి కుమార్ పర్యటించి, పార్టీ కార్యకర్త వల్లభదాసు శాయమ్మ మనవరాలు వల్లభదాసు వినీతకు కాలేజీ ఫీజులు నిమిత్తం 20 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని గద్దె క్రాంతి సొంత నిధులు నుంచి అందజేశారు.

 

             ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనూ, సాధారణ రోజుల్లోనూ, ప్రజా సమస్యలపై పోరాటాల్లోనూ ముందుండేది కార్యకర్తలే అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. కార్యకర్తకు కష్టం వస్తే అది పార్టీకి వచ్చిన కష్టంగా భావిస్తూ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనుకోని పరిస్థితులు — ఏదైనా ఎదురైనా ముందుండి సహాయం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నామన్నారు. కార్యకర్త కుటుంబం సురక్షితంగా, బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందన్నారు. పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్త గౌరవం కాపాడటం, వారి కృషిని గుర్తించడం, అవసరమైన సమయంలో తోడుగా నిలవడం నాయకులు బాధ్యత అన్నారు. పార్టీకి కార్యకర్తలే మా అసలు సంపద అని వారి త్యాగం, నిబద్ధత, విశ్వాసమే పార్టీ విజయానికి పునాదని కార్యకర్తల కుటుంబం అంటే మా కుటుంబమే అన్న భావంతో ఎల్లప్పుడూ వారితో ఉంటామని గద్దె క్రాంతి అన్నారు.

 

             ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు భాగం సాయి ప్రసాద్, ఎస్. ఫిరోజ్, పరిసపోగు విజయ్, దూపాటి శాంతకుమారి, ఒలేటి పావని, పల్లి మాధవి, కొండపల్లి రమేష్ తదితరులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మొవ్వ పెడసనగల్లు గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం
కృష్ణాజిల్లా : పామర్రు నియోజకవర్గం :   మొవ్వ (మ) పెడసనగల్లు గ్రామంలో మైనర్ బాలికపై...
By Rajini Kumari 2025-12-23 10:10:28 0 202
Andhra Pradesh
ఈ నెల 23 న నందికొట్కూరులో కబడ్డీ పోటీలు
కర్నూలు : క్రిస్మస్ సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో ఈనెల 23 24 తేదీల్లో...
By Hari Krishna 2025-12-14 03:55:34 0 304
Goa
Goa on Red Alert: IMD Predicts Heavy Monsoon Rains Ahead
The India Meteorological Department (IMD) has issued a high-priority red alert for Goa,...
By Tejaswini Komanduru 2026-07-02 05:57:01 0 112
Telangana
ప్రాణ రక్షణే లక్ష్యం- అల్వాల్ లో మార్మోగిన "అరైవ్ అండ్ అలైవ్" నినాదం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం...
By Sidhu Maroju 2026-01-16 15:08:36 0 218
Andhra Pradesh
విద్యుత్ చార్జీలపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి గొట్టిపాటి.
జగన్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థలో సృష్టించిన విధ్వంసాన్ని సరిదిద్దామన్న గొట్టిపాటి రాబోయే...
By Pagadala Venkateswar 2026-06-12 11:03:51 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com