కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం గద్దె క్రాంతి కుమార్

0
103

*కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం*

 

      *టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్*

 

 

            పార్టీకి ప్రాణం, నాయకత్వానికి బలం కార్యకర్తలని బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ జెండాను గర్వంగా ఎగరేసేది, ప్రజల మధ్య పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లేది కార్యకర్తలేనని అటువంటి తాము ఎప్పుడు అండగా ఉంటామని టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు.

 

            సోమవారం ఉదయం 19వ డివిజన్ జార్జిపేట ఏరియాలో గద్దె క్రాంతి కుమార్ పర్యటించి, పార్టీ కార్యకర్త వల్లభదాసు శాయమ్మ మనవరాలు వల్లభదాసు వినీతకు కాలేజీ ఫీజులు నిమిత్తం 20 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని గద్దె క్రాంతి సొంత నిధులు నుంచి అందజేశారు.

 

             ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనూ, సాధారణ రోజుల్లోనూ, ప్రజా సమస్యలపై పోరాటాల్లోనూ ముందుండేది కార్యకర్తలే అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. కార్యకర్తకు కష్టం వస్తే అది పార్టీకి వచ్చిన కష్టంగా భావిస్తూ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనుకోని పరిస్థితులు — ఏదైనా ఎదురైనా ముందుండి సహాయం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నామన్నారు. కార్యకర్త కుటుంబం సురక్షితంగా, బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందన్నారు. పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్త గౌరవం కాపాడటం, వారి కృషిని గుర్తించడం, అవసరమైన సమయంలో తోడుగా నిలవడం నాయకులు బాధ్యత అన్నారు. పార్టీకి కార్యకర్తలే మా అసలు సంపద అని వారి త్యాగం, నిబద్ధత, విశ్వాసమే పార్టీ విజయానికి పునాదని కార్యకర్తల కుటుంబం అంటే మా కుటుంబమే అన్న భావంతో ఎల్లప్పుడూ వారితో ఉంటామని గద్దె క్రాంతి అన్నారు.

 

             ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు భాగం సాయి ప్రసాద్, ఎస్. ఫిరోజ్, పరిసపోగు విజయ్, దూపాటి శాంతకుమారి, ఒలేటి పావని, పల్లి మాధవి, కొండపల్లి రమేష్ తదితరులు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కాంపెన్సేషన్ టు విక్టిమ్స్ ఆఫ్ హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీం–2022 అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్
కాంపెన్సేషన్ టు విక్టిమ్స్ ఆఫ్ హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీం–2022 అమలుపై జిల్లా...
By Gadiyapudi Narendra 2026-01-09 10:00:32 0 185
Telangana
అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు దేవరపల్లి కవిత అక్క గారు కొత్త పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చెసారు...
By Ponnala Srinivasrao 2026-03-26 05:27:06 0 116
Andhra Pradesh
జై కిసాన్ స్కీమ్ విజేతలకు బహుమతులు పంపిణీ.
మదనపల్లి: రామసముద్రం టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం జై కిసాన్ జంక్షన్ ఆధ్వర్యంలో లక్కీ డిప్...
By Pagadala Venkateswar 2026-02-28 06:19:22 0 74
Telangana
తవకాలలో బయట పడ్డ 2వ శతాబ్దపు వస్తువుల
నేలకొండపల్లి బౌద్ధస్థూపం వద్ద పురావస్తు శాఖ జరిపిన తవకాలలో 2వ శతాబ్దంనికి చెందిన పళ్ళు వస్తువుల...
By Krishna Balina 2026-01-18 04:45:43 0 415
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com