అనకాపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం, నూకాంభిక అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించుటకు, జరిగిన సమావేశం

0
236

అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అనకాపల్లి శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం, మరియు ఉత్తరాంద్ర పద్మశాలి సంఘం సంయుక్తముగా అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ తేదీ 13-0-32026 న,శుక్రవారం రోజున నూకాంభిక అమ్మవారికి పట్టువస్త్రములు సమర్పించుటకు శ్రీ నూకాంభిక అమ్మవారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ఆఫీసర్ గారికి, మరియు ఛైర్మెన్ గారికి, పద్మశాలి సంఘం పెద్దలు దరఖాస్తు చేసుకోవడమైనది, శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారి దేవస్థానం కార్యవర్గ సభ్యులు అమ్మవారికి పట్టువస్త్రములు పద్మశాలియులు సమర్పించుటకు ఆమోదించిండమైనది, కావున పద్మశాలి కుల భాందవులు,మరియు చేనేత పరిశ్రమ గౌరవ పెద్దలకు,తెలియజేయడమైనది,ప్రతి సంవత్సరం శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారికి పట్టు వస్త్రములు, రాష్ట్ర నలుమూలలనుంచి అమ్మవారికి, తమ చేతులమీదుగా, తమ గోత్ర నామాలతో,ఈసంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం,అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టు వస్త్రములు సమర్పించడం జరుగుతుంది,కావున కుల భాంధావులందరికి తెలియజేయడమైనది,ఈ కార్యక్రమం లో ఉత్తరాంధ్ర పెద్దలు పొన్నగంటి అప్పారావు, ఆల్ ఇండియా ఖాదీ బోర్డ్, మాజీ సభ్యులు బీజేపీ నాయకులు, విశాఖపట్నం జీఎంసీ కో -ఆప్షన్ సభ్యురాలు, భీమిలి మాజీ చైర్ పర్సన్, శ్రీమతి కోప్పల ప్రభావతి, మరియు కోప్పల రమేష్, సింహాచలం దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు, సూరిశెట్టి సూరిబాబు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు పంపాన సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘము, అనకాపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్డి ఈశ్వర్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి, జిల్లా అధ్యక్షులు తిప్పన అప్పారావు, అనకాపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ గెడ్డo దివ్య తేజ, డాక్టర్  యామిని కుమరి,ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది, అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించు భక్తులు, ముందుగా తమ గోత్ర నామాలను, కమిటీ సభ్యుల వద్ద నమోదు చేయించు కోవాలని, నమోదు చేయించుకున్న భక్తుల గోత్ర నామాలు దేవస్థానం సభ్యులకు తెలియజేయడం జరుగుతుందని, అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షలు దొడ్డి ఈశ్వర్ రావు , ఈ సందర్బంగా తెలియజేసారు 

Search
Categories
Read More
Andhra Pradesh
నందిగామలో అశోక్ అగ్రికల్చర్ వర్క్ షాప్ ప్రారంభం
నందిగామ పట్టణం రామన్నపేట రోడ్డు బైపాస్‌లోని రమణ కాలనీ ఫ్లైఓవర్ క్రింద నూతనంగా ఏర్పాటు చేసిన...
By Patan Khuddus 2026-05-13 16:47:31 0 99
West Bengal
কলকাতা–সাইরাং এক্সপ্রেস ট্রেন সার্ভিস শুরু
আজই #কলকাতা থেকে #সাইরাং (মিজোরাম) পর্যন্ত নতুন #ট্রেন সার্ভিস শুরু হয়েছে —...
By Pooja Patil 2025-09-13 05:59:49 0 185
Andhra Pradesh
అలాంటి వాటిని నమ్మకండి: పుంగనూరు కమిషనర్
పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పేరుతో కొందరు వ్యక్తులు రాంగ్ కాల్స్ చేస్తూ, ఇంటి,...
By Kothuru Murali 2026-03-02 04:05:08 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com