అనకాపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం, నూకాంభిక అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించుటకు, జరిగిన సమావేశం

0
368

అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అనకాపల్లి శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం, మరియు ఉత్తరాంద్ర పద్మశాలి సంఘం సంయుక్తముగా అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ తేదీ 13-0-32026 న,శుక్రవారం రోజున నూకాంభిక అమ్మవారికి పట్టువస్త్రములు సమర్పించుటకు శ్రీ నూకాంభిక అమ్మవారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ఆఫీసర్ గారికి, మరియు ఛైర్మెన్ గారికి, పద్మశాలి సంఘం పెద్దలు దరఖాస్తు చేసుకోవడమైనది, శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారి దేవస్థానం కార్యవర్గ సభ్యులు అమ్మవారికి పట్టువస్త్రములు పద్మశాలియులు సమర్పించుటకు ఆమోదించిండమైనది, కావున పద్మశాలి కుల భాందవులు,మరియు చేనేత పరిశ్రమ గౌరవ పెద్దలకు,తెలియజేయడమైనది,ప్రతి సంవత్సరం శ్రీ శ్రీ శ్రీ నూకాంభిక అమ్మవారికి పట్టు వస్త్రములు, రాష్ట్ర నలుమూలలనుంచి అమ్మవారికి, తమ చేతులమీదుగా, తమ గోత్ర నామాలతో,ఈసంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం,అనకాపల్లి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టు వస్త్రములు సమర్పించడం జరుగుతుంది,కావున కుల భాంధావులందరికి తెలియజేయడమైనది,ఈ కార్యక్రమం లో ఉత్తరాంధ్ర పెద్దలు పొన్నగంటి అప్పారావు, ఆల్ ఇండియా ఖాదీ బోర్డ్, మాజీ సభ్యులు బీజేపీ నాయకులు, విశాఖపట్నం జీఎంసీ కో -ఆప్షన్ సభ్యురాలు, భీమిలి మాజీ చైర్ పర్సన్, శ్రీమతి కోప్పల ప్రభావతి, మరియు కోప్పల రమేష్, సింహాచలం దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు, సూరిశెట్టి సూరిబాబు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు పంపాన సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘము, అనకాపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్డి ఈశ్వర్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అనకాపల్లి, జిల్లా అధ్యక్షులు తిప్పన అప్పారావు, అనకాపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ గెడ్డo దివ్య తేజ, డాక్టర్  యామిని కుమరి,ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది, అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించు భక్తులు, ముందుగా తమ గోత్ర నామాలను, కమిటీ సభ్యుల వద్ద నమోదు చేయించు కోవాలని, నమోదు చేయించుకున్న భక్తుల గోత్ర నామాలు దేవస్థానం సభ్యులకు తెలియజేయడం జరుగుతుందని, అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షలు దొడ్డి ఈశ్వర్ రావు , ఈ సందర్బంగా తెలియజేసారు 

Search
Categories
Read More
Telangana
ఓయో రూమ్స్ పై పోలీసుల ఆకస్మిక తనిఖీలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి :  అల్వాల్ లోని పలు ప్రాంతాల్లో ఓయో రూమ్స్ ని తనికి చేసిన అల్వాల్...
By Sidhu Maroju 2025-10-30 14:13:48 0 216
Telangana
ఎన్నికల సిబ్బంది పై వీధి కుక్కల దాడి
కరీంనగర్ లో వీధి కుక్కల హల్చల్ SRR కాలేజ్ లో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఘటన ఆరుగురు...
By Bouth Arun 2026-02-11 06:25:54 0 416
Telangana
లా అభ్యర్థులకు అలర్ట్ టీజీ లాసెట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల
🎤భారత్ ఆవాజ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనుబంధ న్యాయ కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం TG...
By Chunarkar Jagadeesh 2026-06-27 06:26:43 0 124
Andhra Pradesh
మదనపల్లి: కరెంట్ షాక్‌తో బాలుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని అమ్మచెరువుమిట్టలో మంగళవారం విష్ణు (7) అనే బాలుడు కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-06-04 05:36:02 0 70
Telangana
ఎండల ప్రభావం వల్ల తగ్గిన ...గృహజ్యోతి లబ్ధిదారుడు!
WGL: ఎండల ప్రభావం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు భారత్ అవాజ్ న్యూస్:5 జూన్ రోజున విద్యుత్ CMD...
By Gujile Ramu 2026-06-05 06:28:57 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com