Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో భారీ ఊరట.

0
276

ఏకసభ్య కమిషన్ ఏర్పాటును సవాలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత

కమిటీ విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం

సిట్, కమిటీ దర్యాప్తులు వేర్వేరని, ఒకదానిపై ఒకటి ప్రభావం చూపవని వెల్లడి

రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్‌కుమార్‌ కమిటీ నివేదికకు మార్గం సుగమం

 

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలకు సంబంధించిన వివాదంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ విచారణను కొనసాగించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కమిషన్ నియామకాన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఇవాళ‌ కీలక తీర్పు వెలువరించింది.

 

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. తిరుమల నెయ్యి వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్ దర్యాప్తు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా మరో కమిటీని ఎలా ఏర్పాటు చేస్తుందని సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీఎం చంద్రబాబు, టీటీడీ, సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు.

 

స్వామి వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఒక దర్యాప్తు సంస్థ విచారణ మరో కమిటీపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది. "రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ పరిపాలనాపరమైన లోపాలను గుర్తించేందుకు ఏర్పాటు చేయబడింది. ఇది సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేస్తుందని మేము భావించడం లేదు. చట్ట ప్రకారం సిట్, ఏకసభ్య కమిటీ తమ తమ విధులను నిర్వర్తించవచ్చు" అని ధర్మాసనం పేర్కొంది. ఈ రెండు విచారణలు వేర్వేరని, ఒకదాని పరిధిలోకి మరొకటి రాదని (ఓవర్‌లాపింగ్ కాదని) తేల్చి చెప్పింది.

 

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి కొనుగోలు టెండర్లు, నిబంధనల సడలింపులో లోపాలు జరిగాయని సీబీఐ సిట్ తన నివేదికలో ప్రభుత్వానికి వెల్లడించింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. ఈ సిట్ నివేదిక ఆధారంగా ఎవరిపై, ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది.

 

తాజాగా సుప్రీంకోర్టు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో దినేశ్‌కుమార్ కమిటీ తన విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.

Search
Categories
Read More
SURAKSHA
Zendage Hanumant Kondiba IAS: A Visionary Administrator
A dedicated Telangana IAS officer known for transparent governance, citizen-centric...
By Lokeshwari Panthadi 2026-07-15 06:40:50 0 137
Andhra Pradesh
*మహిళా దినోత్సవ వేడుకలలో మాజీ సైనికుల రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం లోని మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి...
By Vadlamudi NagaVenkat 2026-03-08 17:24:23 0 909
Andhra Pradesh
AP: Sachivalayam Name Change 2026: సచివాలయాల పేరు మార్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లు, పట్టణ ప్రాంతాల్లోని “వార్డు...
By Pagadala Venkateswar 2026-01-05 17:11:44 0 477
Telangana
విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోడి
గుజరాత్ లోని అహ్మదాబాద్, విమానాశ్రయం నుండి టేకప్ అయిన కొద్దిసేపటికే లండన్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా...
By Sidhu Maroju 2025-06-13 14:53:57 0 1K
Telangana
జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
అల్వాల్ డివిజన్ లోని  జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2025-07-14 12:47:11 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com