తెలుగు పద్యాల పోటీల్లో మెరిసిన విద్యార్థులు

0
420

​మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 21(భారత్ ఆవాజ్):

మాతృభాష మనిషికి ప్రాణం వంటిదని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని దొరవారివేంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) ప్రధానోపాధ్యాయులు సువర్ణపాక కృష్ణ అన్నారు. శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. వారు మాట్లాడుతూ..... మాతృభాషలో విద్యాభ్యాసం చేయడం వల్ల సృజనాత్మకత పెరుగుతుందని, తెలుగు భాషా గొప్పతనాన్ని చాటిచెప్పారు.

​"మన సంస్కృతికి, మూలాలకు ప్రాణం పోసేది మన మాతృభాష మాత్రమే. ఇలాంటి పోటీలు పిల్లల్లో భాషా పటిమను పెంచుతాయి."విద్యార్థులలో తెలుగు భాషపై మక్కువ పెంచేందుకు "తెలుగు పద్యాల పోటీలు" నిర్వహించారు. విద్యార్థులు శతక పద్యాలను అనర్గళంగా ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.​ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణా రెడ్డి, భారతి, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి.
Alert… ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ ఫోటోలలో ఉన్న దొంగలు...
By Ponnala Srinivasrao 2026-05-03 16:53:32 0 74
Telangana
"ప్రజల దాహం తీర్చడమే లక్ష్యం: చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో, ప్రజలకు...
By Sidhu Maroju 2026-04-29 09:28:21 0 159
Andhra Pradesh
TTD: తిరుమలలో పట్టు శాలువాల స్కామ్ ఎఫెక్ట్.. టీటీడీ కీలక నిర్ణయం.
ఆప్కో, కోఆప్టెక్స్‌ల నుంచి వస్త్రాలు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ రూ.43 కోట్ల విలువైన...
By Pagadala Venkateswar 2026-03-05 03:53:19 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com