విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణ అవసరం... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

0
145

 

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు.ఏ ఏ సబ్జెక్టు ను ఏ విధంగా చదవాలో వివరించారు.పలు మోటివేషన్ కథలు చెప్పారు.పదవ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్,వివిధ భాష సామర్ధ్యాల ను పరిశీలించి,పలు గణిత సమస్యలను పరిష్కరించారు. పరీక్షల సమయంలో సమయాన్ని జాగ్రత్తగా 

ఉపయోగించుకోవాలన్నారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో గరిష్ట ఉత్తీర్ణత సాధించడం, గుణాత్మక అభ్యాస ప్రమాణాలు పెంపొందించడం లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు.పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న నేపధ్యంలో సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నారు.అందరూ ప్రత్యేక తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని, 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లా కు మంచి పేరు తేవాలన్నారు.వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాలులు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com