నిజాయితీ చాటుకున్న ఆటో *డ్రైవర్
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మండలంలోని సాల్మన్ సెంటర్ సమీపంలోని హైమ ఆసుపత్రి వద్ద నుండి ఒక మహిళ ఆటోలో ప్రయాణించి సంఘం థియేటర్ వద్ద దిగింది. దిగే సమయంలో ఆమె వద్ద ఉన్న మూడున్నర సవర్ల బంగారు తాళిబొట్టు తాడు ఆటోలోనే చేజారిపోయింది.
బాధితురాలు జంగిలి లక్ష్మి, జాండ్రపేట సీతానగరం రైల్వే గేటు సమీపంలో నివాసం ఉంటున్నారు. తాను ప్రయాణించిన ఆటోలో తాళిబొట్టు పోగొట్టుకున్న విషయం తెలుసుకున్న ఆమె ఆందోళనకు గురయ్యారు.
ఆటో డ్రైవర్ మొగిలి రాజు తన వాహనంలో బంగారు తాళిబొట్టు కనిపించడంతో బాధ్యతగా వ్యవహరించి యజమానిని వెతికే ప్రయత్నం చేశారు. అనంతరం ఆయన ఆ తాళిబొట్టును చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అప్పగించారు.
వన్టౌన్ సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరించి బాధితురాలిని గుర్తించారు. నేడు జంగిలి లక్ష్మి పోలీస్ స్టేషన్కు వచ్చి అవసరమైన ఆధారాలు సమర్పించగా, ఆమెకు తాళిబొట్టును తిరిగి అందజేశారు.
ఈ సందర్భంగా నిజాయితీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ మొగిలి రాజును, సీఐ, ఎస్, సుబ్బారావు, అభినందించారు. పరాయి సొమ్ముపై ఆశపడకుండా బాధ్యతగా వ్యవహరించడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.
#Narendra
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz