నిజాయితీ చాటుకున్న ఆటో *డ్రైవర్

0
127

చీరాల: బాపట్ల జిల్లా చీరాల మండలంలోని సాల్మన్ సెంటర్ సమీపంలోని హైమ ఆసుపత్రి వద్ద నుండి ఒక మహిళ ఆటోలో ప్రయాణించి సంఘం థియేటర్ వద్ద దిగింది. దిగే సమయంలో ఆమె వద్ద ఉన్న మూడున్నర సవర్ల బంగారు తాళిబొట్టు తాడు ఆటోలోనే చేజారిపోయింది.
బాధితురాలు జంగిలి లక్ష్మి, జాండ్రపేట సీతానగరం రైల్వే గేటు సమీపంలో నివాసం ఉంటున్నారు. తాను ప్రయాణించిన ఆటోలో తాళిబొట్టు పోగొట్టుకున్న విషయం తెలుసుకున్న ఆమె ఆందోళనకు గురయ్యారు.
ఆటో డ్రైవర్ మొగిలి రాజు తన వాహనంలో బంగారు తాళిబొట్టు కనిపించడంతో బాధ్యతగా వ్యవహరించి యజమానిని వెతికే ప్రయత్నం చేశారు. అనంతరం ఆయన ఆ తాళిబొట్టును చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి అప్పగించారు.
వన్‌టౌన్ సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరించి బాధితురాలిని గుర్తించారు. నేడు జంగిలి లక్ష్మి పోలీస్ స్టేషన్‌కు వచ్చి అవసరమైన ఆధారాలు సమర్పించగా, ఆమెకు తాళిబొట్టును తిరిగి అందజేశారు.
ఈ సందర్భంగా నిజాయితీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ మొగిలి రాజును, సీఐ, ఎస్, సుబ్బారావు, అభినందించారు. పరాయి సొమ్ముపై ఆశపడకుండా బాధ్యతగా వ్యవహరించడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Haryana
Haryana CM Orders Action on Sanitation Negligence and Land Encroachment
Haryana Chief Minister Nayab Singh Saini took strong action against poor civic management in...
By Bharat Aawaz 2025-07-17 06:14:07 0 1K
Telangana
ఫోన్ ట్యాపింగ్ ఎట్ మల్కాజ్గిరి కాంగ్రెస్ లీడర్స్
*ఫోన్ ట్యాపింగ్ @ మల్కాజిగిరి లీడర్స్. *మల్కాజ్గిరి ని వదలని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.మైనంపల్లి...
By Vadla Egonda 2025-06-18 19:57:24 0 1K
Andhra Pradesh
రాజకీయాలు పక్కన పెట్టి నిందితుడికి కఠిన శిక్ష విధించాలి.
మదనపల్లెలో మైనర్ బాలిక హత్య ఘటనపై రాజకీయ అండదండలు పక్కన పెట్టి నిందితుడిని కఠినంగా శిక్షించాలని...
By Pagadala Venkateswar 2026-02-18 07:00:53 0 94
Andhra Pradesh
​లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్...
By Pagadala Venkateswar 2026-03-08 04:50:01 0 83
Andhra Pradesh
కాకినాడను కుదిపేసిన భీకర విస్ఫోటనం వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు – 23 మంది మృతి రూ.20 లక్షల రాష్ట్ర పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు
సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా:శనివారం మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాల సమయంలో...
By Ratna Sekhar 2026-02-28 18:16:40 0 490
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com