రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేశ్ పై జరిగిన దాడి అత్యంత అమానుషమని చీరాల తెలుగు యువత అధ్యక్షుడు దోగుపర్తి బాలకృష్ణ మండిపడ్డారు.

0
157

 గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.రాజకీయాల్లో విభేదాలు ఉండటం సహజమని, అయితే వాటిని హింస ద్వారా వ్యక్తపరచడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలనిఎలాంటి అసంతృప్తి ఉన్నా ఓటు ద్వారానే సమాధానం చెప్పాలి తప్ప, భౌతిక దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.దాడులు, బెదిరింపులు వంటి హింసాత్మక చర్యలు రాజకీయ సంస్కృతికి మచ్చ తెస్తాయని, ఇటువంటి ఘటనలు సమాజంలో అశాంతికి దారితీస్తాయని ఆయన హెచ్చరించారు.భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని దోగుపర్తి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

దుండి రాకేశ్‌పై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధం. 

అసంతృప్తి ఉంటే ఓటు ద్వారా చూపాలి, హింస ద్వారా కాదు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

రాజకీయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని దోగిపర్తి బాలకృష్ణ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుక :
కర్నూలు సిటీ :  కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారి కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్...
By Hari Krishna 2026-01-23 14:16:27 0 168
Telangana
నిజామాబాద్: పోలీస్ ప్రోటెక్షాన్ యాక్ట్ థిసుకురవాలి .అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్సూర్యనారాయణ
అడ్వికేట్‌ప్రోటక్ మాధిరి గానే పోలీస్ ప్రోటెక్షాన్ యాక్ట్ థిసుకూ రావల్సినా అవసారం ఎంతైనా...
By Sadaq Sadaq 2026-03-30 18:19:45 0 139
Telangana
నిజామాబాద్: బసులు బంద్
నిజామాబాద్ ఆర్టీసీ కార్మికులు సమ్మే  కరణంగా జిల్లాలో  బసులు బంధు కవాడo తో ప్రయానికులు...
By Sadaq Sadaq 2026-04-22 09:29:23 0 102
Andhra Pradesh
'స్త్రీ శక్తి' థీమ్‌తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు.
  'స్త్రీ శక్తి' థీమ్‌తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు Andhra...
By Pagadala Venkateswar 2026-05-22 05:24:01 0 38
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com