చింతూరు ఏరియా ఆసుపత్రిలో ప్రసవ ఆపరేషన్లు నిలిచిపోయాయి: సీపీఐ(ఎం) ఆరోపణ!
చింతూరులోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత వారం రోజులుగా ప్రసవ సేవలు నిలిచిపోయాయని సీపీఐ(ఎం) నాయకులు పల్లపు వెంకట్, సీసం సురేష్ ఆరోపించారు. ఆసుపత్రిలో అనస్థీషియా డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, సిజేరియన్ ప్రసవాలు పూర్తిగా ఆగిపోయాయని వారు తెలిపారు. గతంలో ఉన్న ఎం,వి, కోటిరెడ్డి పదవి విరమణ చేయడంతో అనస్థీషియా డాక్టర్ లేక గర్భిణులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు. "ఈ...