చింతూరు: పొల్లూరు జలపాతంలో ప్రమాద వశత్తు నీటిలో మునిగి యువకుడి మృతి!

0
178

చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పొల్లూరు జలపాతం వద్ద ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన అఖిల్ (22) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పొల్లూరు జలపాతాన్ని సందర్శించడానికి వచ్చాడు. అందరూ కలిసి జలపాతం అందాలను ఆస్వాదిస్తూ, నీటిలో కేరింతలు కొడుతున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. అఖిల్ ప్రమాదవశాత్తు జలపాతంలోని లోతైన నీటి గుండంలో పడి మునిగిపోయాడు.కళ్లముందే అఖిల్ నీటిలో మునిగిపోతుండడం గమనించిన స్నేహితులు వెంటనే అతడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. నీటిలో మునిగి ఊపిరాడక అఖిల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు స్థానికులు నిర్ధారించారు.కళ్లముందే ప్రాణస్నేహితుడు శవంగా మారడంతో తోటి స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మొతుగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
జుక్కల్ : చిరుత మృత్యువాత
జుక్కల్ మండలం బస్వాపూర్ - దోస్పల్లి శివారులో చిరుత మృత్యువాత పడిందని స్థానికులు తెలిపారు. సోమవారం...
By Thativar Shivaji 2026-01-20 08:08:50 0 720
Telangana
కరీంనగర్ : డెలివరీ బాయ్ ఆత్మహత్య...!
కరీంనగర్, వీణవంక మండలం మామిడిపల్లిలో ఆన్లైన్ గేమ్ కు అలవాటు పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న గడన...
By Sunka Santhosh 2026-06-10 18:00:10 0 177
Telangana
ఎల్‌నినో పంజా..!
"తెలంగాణలో మారనున్న వర్షాల తీరు.. రైతులు, ప్రజలు తెలుసుకోవాల్సిన కీలక విషయాలివే" హైదరాబాద్ :...
By Sidhu Maroju 2026-07-06 14:35:20 0 79
Telangana
రవాణా శాఖ అధికారిని బలికొన్న బొగ్గు టిప్పర్
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామ పరిధిలోని భూపాలపల్లి పర్కాల ప్రధాన రోడ్డుపై ఉన్న...
By Sriramula Anil 2026-06-23 01:35:29 0 135
Telangana
నేటి నుంచి పాన్ కార్డ్స్‌ రూల్స్‌ మార్పు
నేటి నుంచి పాన్ కార్డ్స్‌ రూల్స్‌ మార్పు దేశంలో ఆర్థిక లావాదేవీల పారదర్శకతను పెంచే...
By Pinnehasan Odela 2026-04-01 07:09:46 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com