#Big fan of @urstrulymahesh ❤️🌟
#మంచిగా ఉండేవాళ్ళని ఆదరిస్తా, చెడుగా ఉండేవాళ్ళని అణచివేస్తా 😐
#అన్ని కులాలను, మతాలను గౌరవించే మనస్తత్వం 🤩
  • 142 Posts
  • 2 Photos
  • 14 Videos
  • Journalist at Vizianagaram
  • Studied UNDER GRADUATED at Srichaitanya ITC
    Class of ITI, srichaitanya ITC
  • Followed by 0 people
Basic Info
  • Experience
    2 Years
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Journalist
Location Info
  • State
    Andhra Pradesh (AP)
Search
Recent Updates
  • టీటీడీ ఛైర్మన్ ను తొలగించాలి: మాజీ ఎమ్మెల్యే శంబంగి
    మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును ఛైర్మన్ పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ శనివారం బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయం వద్ద పూజలు చేసి నిరసన తెలిపారు. చైర్మన్ ప్రవర్తన తిరుమల పవిత్రతను తగ్గించేలా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు....
    0 Comments 0 Shares 59 Views 0 Reviews
  • ఘోరం.. జనరేటర్లో చిక్కుకొని..!
    దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం 8వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి ఊరేగింపును శుక్రవారం రాత్రి చేపట్టారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ లోనికి తరిని మాధురి(28) అనే మహిళ జుట్టు వెళ్లడంతో తల మీద చర్మంతో పాటు మొత్తం ఊడిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళను విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. #RAJESH 
    0 Comments 0 Shares 57 Views 0 Reviews
  • అమరావతి రాజాధానిపై బొబ్బిలిలో సంబరాలు
    రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించినందుకు గురువారం బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు. అమరావతి రాజధాని ప్రకటించడంతో ఎంపీడీఓ కార్యాలయంలో ముగ్గులు వేసి కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి ప్రకటించడం ఆనందంగా ఉందని ఎంపీడీఓ రవికుమార్ అన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు. #RAJESH 
    0 Comments 0 Shares 54 Views 0 Reviews
  • గవరమ్మపేట పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచారం
    గవరమ్మపేట గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. గ్రామస్థులు, రైతులు పొలాల్లోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఏనుగులు కనిపించినప్పుడు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. #RAJESH 
    0 Comments 0 Shares 67 Views 0 Reviews
  • బర్త్ సర్టిఫికేట్ జారీలో అలసత్వం తగదు
    వృద్ధులకు బర్త్ సర్టిఫికేట్ జారీలో అలసత్వం తగదని జన జాగృతి ఉత్తరాంధ్ర కన్వీనర్ శ్రీరపు శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అతిధి గజపతికి వినతిపత్రం అందించారు. విజయనగరంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమెను కలిసి వృద్ధులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. జిల్లాలో ఈ సమస్యతో 3,733 మంది వృద్ధలు ఇబ్బంది పడుతున్నారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. #RAJESH 
    0 Comments 0 Shares 59 Views 0 Reviews
  • నెలవాడలో అర్ధరాత్రి దొంగల బీభత్సం..!
    బొండపల్లి మండలం నెలవాడలో షేక్ రసూల్ ఇంట్లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. సమాచారం అందుకున్న బొండపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫొరెన్సిక్ బృందం ఇంట్లో వేలిముద్రలను సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. #RAJESH 
    0 Comments 0 Shares 64 Views 0 Reviews
  • అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
    బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. బొబ్బిలి కోటలో బుధవారం మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా పని చేయాలన్నారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు మంజూరు చేయాలన్నారు.గొల్లపల్లి,పాతబొబ్బిలి గ్రామదేవత పండుగలకు సంపూర్ణంగా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. #RAJESH 
    0 Comments 0 Shares 66 Views 0 Reviews
  • ఎమ్మెల్యే కళాపై జడ్పీ ఛైర్మన్ ఫైర్
    చీపురుపల్లి MLA కళా వెంకట్రావు ఇటీవల బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యక్తిగత దూషణలను జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రాజాంలో విలేకరుల సమావేశంలో ఖండించారు. మూలపేట పోర్టు అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సరికాదు అంటూ మండిపడ్డారు. వ్యక్తిగత దూషణల కోసం మాట్లాడితే తాము కూడా మాట్లాడటం పెద్ద పనేం కాదంటూ హెచ్చరించారు....
    0 Comments 0 Shares 64 Views 0 Reviews
  • అగ్నిప్రమాద బాధితులను ఆర్థిక సాయం
    బొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాద బాధితులను ఎమ్మెల్యే బేబినాయన బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కంచాలు, దుప్పట్లు అందించి ఆర్థిక సహాయం చేశారు. అగ్నిప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. #RAJESH 
    0 Comments 0 Shares 75 Views 0 Reviews
  • ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి
    గ్రామాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం పిరిడిలో బుధవారం విబీ జీ రామ్ జీ ఉపాధి హామీ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులు ప్రారంభించి వేతనదారులకు పనులు కల్పించాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులు చేయాలన్నారు. #RAJESH 
    0 Comments 0 Shares 76 Views 0 Reviews
  • ఆస్తిపన్ను వసూళ్లలో వెనుకబడ్డ బొబ్బిలి మున్సిపాలిటీ
    ఆస్తిపన్ను వసూళ్లలో ఎప్పుడు ముందుండే బొబ్బిలి మున్సిపాలిటీ ఈఏడాది వెనుకబడి మూడో స్థానంలో నిలిచింది. మున్సిపాలిటీలో 13,222 నివాస, వాణిజ్య భవనాలు నుంచి రూ.6.78 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.5.13కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో నెల్లిమర్ల మొదటి స్థానం, రాజాం రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. కుళాయి పన్ను రూ.60,69,567 వసూలు అయినట్లు మున్సిపల్ అధికారులు చెప్పారు. #RAJESH 
    0 Comments 0 Shares 72 Views 0 Reviews
  • లక్ష దీపాలార్చనకు విశేష స్పందన
    బొబ్బిలి మండలం నారాయణప్పవలస, కాశిందొరవలసలో మంగళవారం బ్రహ్మ కుమారీలు నిర్వహించిన లక్ష దీపాలార్చనకు విశేష స్పందన లభించింది. గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి శివలింగాలకు పూజలు చేశారు. దీపాలను వెలిగించేందుకు రెండు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆధ్యాత్మిక చింతనతో మనస్సు ప్రశాంతత లభిస్తుందని బ్రహ్మ కుమారి రాజేశ్వరి అన్నారు. #RAJESH 
    0 Comments 0 Shares 73 Views 0 Reviews
  • పన్నులు చెల్లించిన ప్రజలకు కృతజ్ఞతలు:కమిషనర్
    బొబ్బిలి మున్సిపాలిటీలో పన్నులు చెల్లించిన ప్రజలకు కమిషనర్ ఎల్.రామలక్ష్మి,సిబ్బంది కృతజ్ఞతలు చెప్పారు.మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ..ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరిస్తున్నారని చెప్పారు.పన్నులు చెల్లించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి వసూలు చేసిన సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. #RAJESH 
    0 Comments 0 Shares 69 Views 0 Reviews
  • కోమటిపల్లిలో అగ్నిప్రమాదం.. రెండిళ్లు దగ్ధం
    బొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంలో మోతి గౌరి ఇల్లు పూర్తిగా కాలిపోగా మోతి సాంబయ్య ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. అగ్నిప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లో అగ్నిమాపక అధికారులు చేరుకుని మంటలను అదుపు చేయడంతో నష్టాన్ని నివారించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. #RAJESH 
    0 Comments 0 Shares 84 Views 0 Reviews
  • నేడు శంబర పోలమాంబ చివరి వారం జాతర
    ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత, రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన శంబర పోలమాంబ అమ్మవారి జాతర నేటితో 10వ వారానికి చేరుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఛైర్మన్ చిన తిరుపతి, ఆలయ ఈవో బి.శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పటిష్ఠమైన క్యూలైన్లు, బారీకేట్లు, శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనంతో పాటు ఉచిత దర్శనం, తాగునీరు ఏర్పాటు చేశారు. #RAJESH 
    0 Comments 0 Shares 83 Views 0 Reviews
  • టెర్రస్ గార్డెన్తో అధిక లాభాలు
    టెర్రస్ గార్డెన్తో అధిక లాభాలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి అన్నారు. బొబ్బిలి పట్టణంలోని వెలమవారివీధిలో ఎం.లక్ష్మి టెర్రస్ గార్డెన్తో కూరగాయలు,పువ్వులు మొక్కలు పెంచడాన్ని మంగళవారం పరిశీలించారు. ఇంటిలో కూరగాయల వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారు చేసి టెర్రస్ గార్డెన్తో మొక్కలు పెంచాలని ప్రజలను కోరారు. ఇంటి అవసరాలకు కూరగాయలు పండించుకోవచ్చునన్నారు. #RAJESH 
    0 Comments 0 Shares 82 Views 0 Reviews
  • కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు: బొబ్బిలి ఎమ్మెల్యే
    టీడీపీ కోసం కస్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి కోటలో ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. టీడీపీ జెండాను మాజీ ఎంపీపీ బి.సింహాచలంతో కలిసి ఆవిష్కరణ చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు. టీడీపీ కోసం పని చేసిన కార్యకర్తలను అధిష్ఠానం గుర్తిస్తుందన్నారు. చంద్రబాబు ప్రసంగాన్ని స్క్రీన్ ద్వారా వీక్షించారు....
    0 Comments 0 Shares 94 Views 0 Reviews
  • గొల్లపల్లి దాడితల్లి సిరిమాను చెట్టు కొట్టిన బేబినాయన
    గొల్లపల్లి దాడితల్లి గ్రామ దేవత పండగ ఏప్రిల్ 26, 27, 28న జరగనుంది. ఈ నేపథ్యంలో సిరిమనోత్సవానికి చెట్టును ఎమ్మెల్యే బేబినాయన కొట్టారు. బొబ్బిలికి సమీపంలో ఉన్న మహారాణి తోట సమీపంలో చెట్టును ఉత్సవ కమిటీ సభ్యులు గుర్తించారు. చెట్టుకు ఆదివారం పూజలు చేసి కొట్టారు. పండగ ప్రశాంతగా, విజయవంతంగా చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఛైర్మన్ పిరిడి ఈశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు....
    0 Comments 0 Shares 94 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com