#Big fan of @urstrulymahesh ❤️🌟
#మంచిగా ఉండేవాళ్ళని ఆదరిస్తా, చెడుగా ఉండేవాళ్ళని అణచివేస్తా 😐
#అన్ని కులాలను, మతాలను గౌరవించే మనస్తత్వం 🤩
  • 250 Posts
  • 2 Photos
  • 21 Videos
  • Journalist at Vizianagaram
  • Studied UNDER GRADUATED at Srichaitanya ITC
    Class of ITI, srichaitanya ITC
  • Followed by 0 people
Basic Info
  • Experience
    2 Years
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Student
Location Info
  • State
    Andhra Pradesh (AP)
Search
Pinned Post
Like
1
0 Comments 0 Shares 179 Views 16 0 Reviews
Recent Updates
  • భోగాపురంలో ప్రధాని సభకు 2 లక్షల మంది..!
    ఆగస్టు 1న PM మోదీ పాల్గొనే భోగాపురం బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరుకానున్న నేపథ్యంలో పకడ్బందీగా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్ కార్పెట్, ప్రకృతి, సన్దే, PSR లేఔట్లలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, VZM, విశాఖ జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయిస్తున్నారు. VIP, VVIP వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు....
    0 Comments 0 Shares 13 Views 0 Reviews
  • అంగరంగ వైభవంగా జగన్నాథ స్వామి రథయాత్ర
    బొబ్బిలి పట్టణంలో శుక్రవారం జగన్నాధస్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. కంచరవీధిలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రథయాత్ర ప్రారంభించారు. ఎమ్మెల్యే బేబినాయన స్వామిని దర్శంచుకొని పూజలు చేశారు. రథయాత్రకు పట్టణం, గ్రామీణ ప్రాంతాలు నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. #Rajesh
    0 Comments 0 Shares 15 Views 0 Reviews
  • డ్రంకెన్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలుశిక్ష
    డ్రంకెన్ డ్రైవ్ కేసులో బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన వ్యక్తికి మూడు రోజులు జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి జి.విజయకన్నబాబు తీర్పు చెప్పినట్లు పట్టణ సిఐ కె.నారాయణరావు చెప్పారు. బొబ్బిలి పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ వి.లోవరాజు వాహనాలు తనిఖీ చేస్తుండగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో మద్యం తాగినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 26 Views 0 Reviews
  • లోకల్ Vs నాన్ లోకల్.. విజయనగరంలో వెలసిన ఫ్లెక్సీ
    విజయనగరం కార్పొరేషన్లో స్థానిక ఎన్నికల వేడి మొదలైంది. స్థానికులకే టికెట్లు కేటాయించాలన్న డిమాండ్తో పలు డివిజన్లలో శనివారం ఫ్లెక్సీలు వెలిశాయి. స్థానికేతరులకు టికెట్లు ఇస్తే ఓడిస్తామన్న హెచ్చరికలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో 50 డివిజన్లు ఉండగా తాజాగా ఆ సంఖ్య 64కు పెరగడంతో టికెట్ల కోసం పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో 'లోకల్' నినాదం పార్టీలకు ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది. దీనిపై మీ కామెంట్....
    0 Comments 0 Shares 43 Views 0 Reviews
  • టిఫిన్ దుకాణంలో ఘర్షణ.. పరస్పర కేసులు: ఎస్ఐ
    సంతకవిటి (M) తాలాడలో జరిగిన ఘర్షణ ఘటనపై పరస్పర ఫిర్యాదుల ఆధారంగా 2 కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపాలరావు తెలిపారు. శుక్రవారం టిఫిన్ సెంటర్లో జరిగిన గొడవలో దాలినాయుడిపై దాడి చేశారంటూ ఆయన భార్య సన్యాసమ్మ ఫిర్యాదు మేరకు రాగోలు అభి, రాంబాబులపై కేసు నమోదు చేశారు. మరోవైపు తనపై కులం పేరుతో దూషించి దాడి చేశారని అభి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సన్యాసమ్మ, దాలినాయుడుతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైందన్నారు....
    0 Comments 0 Shares 40 Views 0 Reviews
  • మైనర్లతో వీడియోలు.. రౌడీషీటర్పై కేసు
    డోలపేట ఎస్సీ కాలనీకి చెందిన రౌడీషీటర్ అనిల్ కుమార్ ఎనిమిది మంది మైనర్లతోచట్టవిరుద్ధంగా వీడియోలు చిత్రీకరించి, వాటిని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ వీడియోలు ప్రజల్లో, ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో భయాందోళనలు కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో రాజాం పట్టణ ఎస్ఐ ఎం.డి.సల్మాన్ బేగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 40 Views 0 Reviews
  • జ్వరంతో గిరిజన విద్యార్థి మృతి
    సాలూరు (M) ఎగువమెండంగికు చెందిన గిరిజన విద్యార్థి జయంత్ జ్వరంతో అస్వస్థతకు గురై గురువారం మృతి చెందాడు. విద్యార్థి తండ్రి దనేల్ తెలిపిన వివరాల మేరకు.. 3 రోజులుగా జ్వరంతో బాధపడుతూ కాళ్లు చేతులు కదపలేని స్థితికి చేరుకున్నాడని, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడన్నారు. ఇటీవల 10 ఫలితాలలో 503 మార్కులు సాధించాడన్నారు.మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థికి ఇలా జరగడంతో అందరూ కన్నీరుమున్నీరుగా...
    0 Comments 0 Shares 43 Views 0 Reviews
  • తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలి
    ఇళ్లలో తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం కృష్ణాపురంలో శుక్రవారం చెత్త సేకరణపై మహిళలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలన్నారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయకపోతే పిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 38 Views 0 Reviews
  • బాబోయ్ ఏనుగులు గుంపు మళ్లీ వచ్చేసింది
    మన్యం జిల్లా రైతులు ప్రజలను గడగడలాడించిన ఏనుగులు గుంపు విజయనగరం జిల్లా బొబ్బిలి పరిసర ప్రాంతాలకు వచ్చేశాయి. 8 ఏనుగుల గుంపు గురువారం సాయంత్రం కలవరాయి మీదుగా ముత్తావలస కమ్మ వలస పరిసర ప్రాంతాలకు చేరుకున్నాయి. పంట పొలాలు, కల్లాలలో ఏనుగులు సంచరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొండదేవుపల్లి, శివడవలస, కమ్మవలస ప్రాంతాలలో ఏనుగులు సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 41 Views 0 Reviews
  • రాజాంలో స్నేక్ క్యాచర్ ని కాటేసిన పాము
    రాజాంలోని తెలగా వీధిలో గురువారం రాత్రి పామును పడుతుండగా స్నేక్ క్యాచర్ గ్రంధి అప్పారావు పాము కాటుకు గురయ్యాడు. నాగుపాముని పట్టుకొనే క్రమంలో అతని చేయి వేలు మధ్యలో కాటు వేసిందని స్థానికులు తెలిపారు. స్థానిక ఏరియా ఆసుపత్రికి వెంటనే తరలించి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచినట్లు చెప్పారు. అప్పారావు ఇప్పటివరకు సుమారు 150 ప్రమాదకరమైన పాములను పట్టి సురక్షిత ప్రాంతాలలో వదిలినట్లు స్థానికులు చెబుతున్నారు....
    0 Comments 0 Shares 39 Views 0 Reviews
  • విశాఖ To భోగాపురం.. ఈ-బస్సులు రెడీ!
    భోగాపురం ఎయిర్పోర్ట్కు APSRTC నడపనున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో 3 బస్సులు బుధవారం విశాఖ స్టీల్ డిపోకు చేరాయి. త్వరలో 20 బస్సులు రానున్నాయని రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు.ప్రారంభోత్సవం అనంతరం గాజువాక నుంచి రెండు మార్గాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్కు ఈ బస్సులు నడుపుతారు. NAD, గురుద్వారా, వెంకోజిపాలెం, వుడా పార్క్ వద్ద లాంజ్లు ఏర్పాటు చేస్తారు. సెప్టెంబర్, అక్టోబర్లో మరో 80 బస్సులు రానున్నాయి....
    0 Comments 0 Shares 47 Views 0 Reviews
  • మ్యుటేషన్లు సకాలంలో పూర్తి చచేయాలి: VZM కలెక్టర్
    మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.బుధవారం విజయనగరం కలెక్టరేట్ నుంచి జేసీ ఎస్.సేధు మాధవన్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐవీఆర్ఎస్ సర్వేపై చర్చిస్తూ, ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేవిధంగా సేవలను అందించాలని ఆదేశించారు. 22-ఏ అప్లికేషన్ల స్థితిగతులు, పాస్ పుస్తకాల పంపిణీ, తదితర అంశాలపై సూచనలు చేశారు....
    0 Comments 0 Shares 47 Views 0 Reviews
  • బొబ్బిలిలో ఘనంగా శ్రీ జగన్నాథోత్సవాలు ప్రారంభం
    బొబ్బిలి కంచరవీధిలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, సేవాకైంకర్యాలు వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించగా, అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది....
    0 Comments 0 Shares 48 Views 0 Reviews
  • టిడ్కో కాలనీల్లో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయాలి: VZM కలెక్టర్
    జిల్లాలోని అన్ని టిడ్కో కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సారిపల్లి, సోనియానగర్, నెల్లిమర్ల, బొబ్బిలి, రాజాం టిడ్కో కాలనీల్లో ఇళ్ల నిర్మాణం, తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ తదితర పనుల పురోగతిని సమీక్షించారు. సోనియానగర్లో తాగునీటి పథకం పనులు వెంటనే ప్రారంభించాలన్నారు....
    1 Comments 0 Shares 76 Views 0 Reviews
  • పెండింగ్ డీఏలు విడుదల చేయాలి
    ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగులో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని INTCU రాష్ట్ర నాయకుCI బి.సాయికృష్ణ డిమాండ్ చేశారు. బొబ్బిలి ఎన్జీవో హోంలో బుధవారం విద్యుత్ ఉద్యోగుల సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏప్రిల్ ఒకటికి అమలు చేయాల్సిన వేతన సవరణ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 69 Views 0 Reviews
  • భార్యను దించి వెళ్తుండగా యాక్సిడెంట్.. భర్త మృతి
    రణస్థలం మండలం నెలివాడ సమీపంలోని NH-16పై సోమవారం ప్రమాదం జరిగింది. పూసపాటిరేగ మండలం గుణపురెడ్డిపాళెంకు చెందిన శ్రావణ్ కుమార్ (39) బైక్పై తన భార్యను రణస్థలంలోని ఓ స్కూల్లో దించి తిరిగి వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న కారు వెనుకనుంచి ఢీకొట్టింది. కారు అతివేగం ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 70 Views 0 Reviews
  • ఇవాళే ముగుస్తుంది ‘సర్'
    విజయనగరం జిల్లాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ముగింపునకు చేరింది.జిల్లాలో 15,78,949 ఓటర్లకుగాను 15,66, 885ఎన్యూమరేషన్ ఫారాలు (99.24 శాతం) డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. మొత్తం 1847 మంది బీఎల్దలు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ఎస్ఐఆర్ గడువు నేటితో ముగుస్తుందని, ఓటర్లు తమ ఫారాలను వెంటనే బీఎల్ఎలకు అందించాలని అధికారులు కోరారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 64 Views 0 Reviews
  • ఎస్ఐర్ శత శాతం పూర్తి చేయాలి: బొబ్బిలి ఎమ్మెల్యే
    బొబ్బిలి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ శత శాతం పూర్తి చేయాలని ఎమ్మెల్యే బేబినాయన ఆదేశించారు. బొబ్బిలి కోటలో సోమవారం ఆర్డీఓ రామ్మోహనరావుతో ఎస్ఐఆర్ సమీక్ష నిర్వహించారు. అర్హులు ఓట్లు రద్దు కాకుండా ప్రతి ఓటరు వివరాలు సేకరించి ఆన్లైన్ చేయాలన్నారు. గృహ నిర్మాణ శాఖాధికారులతో సమావేశం నిర్వహించి అర్హత ఉన్న ప్రతిఒక్కరికి ఇల్లు మంజూరు అయ్యేలా చూడాలన్నారు. గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. #Boiena Rajesh
    0 Comments 0 Shares 80 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com