• నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు
    ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె గ్రామాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు సందర్శించి `నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెసలదిన్నె చెరువును పరిశీలించి రైతులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం నాలుగు దశల్లో అమలు చేయబడుతుందని ఆయన తెలిపారు. మొదటి దశలో 10 రోజుల్లో పనుల గుర్తింపు, రెండో దశలో నిధుల మంజూరు, మూడో దశలో 70 రోజుల్లో పనుల అమలు,...
    0 Comments 0 Shares 36 Views 0 Reviews
  • బంగారం కోసం వృద్ధరాలను చంపి చెరువులో పాతి పెట్టిన సంఘటన చీపురుపల్లి మండలం గొల్లపాలెంలో చోటు చేసుకుంది. గొల్లపాలెంకు చెందిన జి. చిన్నప్పమ్మ వద్ద బంగారానికి ఆశపడి వరుసకు మేనల్లుళ్లు అయిన వై.రమణ, సిహెచ్. రమణ ఫిబ్రవరి 23న హత్య చేసి చెరువులో పాతి పెట్టారు. మృతురాలు అల్లుడు ఫిర్యాదు మేరకు డీఎస్పీ రాఘవులు కేసు దర్యాప్తు చేసి పాతి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకి తరలించారు.
    #RAJESH
    బంగారం కోసం వృద్ధరాలను చంపి చెరువులో పాతి పెట్టిన సంఘటన చీపురుపల్లి మండలం గొల్లపాలెంలో చోటు చేసుకుంది. గొల్లపాలెంకు చెందిన జి. చిన్నప్పమ్మ వద్ద బంగారానికి ఆశపడి వరుసకు మేనల్లుళ్లు అయిన వై.రమణ, సిహెచ్. రమణ ఫిబ్రవరి 23న హత్య చేసి చెరువులో పాతి పెట్టారు. మృతురాలు అల్లుడు ఫిర్యాదు మేరకు డీఎస్పీ రాఘవులు కేసు దర్యాప్తు చేసి పాతి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకి తరలించారు. #RAJESH
    0 Comments 0 Shares 37 Views 0 0 Reviews
  • చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపండి
    చెరువులు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఎంపీడీవో పి.రవికుమార్ ఆదేశించారు. బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. జలధార, నీటి భద్రత సాగునీటి సంఘాలు బాధ్యత అన్నారు. చెరువులను మరమ్మతులు చేసేందుకు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. #RAJESH 
    0 Comments 0 Shares 39 Views 0 Reviews
  • ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలి
    రాజకీయ పార్టీ నాయకులు ఓటట్ల జాబితా సవరణకు సహకరించాలని ఎమ్మార్వో ఎం.శ్రీను, ఎన్నికల డీటీ బి.గౌరీశంకర్ కోరారు. బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. నూతన ఓటర్ల చేర్పునకు, నకిలీ, డబుల్ ఎంట్రీ ఓట్లు, మరణించిన వారి ఓట్లు తొలగింపునకు సహకరించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలన్నారు. #RAJESH 
    0 Comments 0 Shares 34 Views 0 Reviews
  • గ్రామాల్లో ప్రతి కదలికపై నిఘా పెట్టాలి
    గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు నివారణకు ప్రతి కదలికపై నిఘా పెట్టాలని మహిళా సంరక్షణ అధికారులను పట్టణ సీఐ కె.నారాయణరావు ఆదేశించారు. బొబ్బిలి పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం సమావేశం నిర్వహించారు. గ్రామాలలో గంజాయి నివారణ ప్రతి కదలికను గమనించలన్నారు. సైబర్ నేరాలు బారిన పడకుండా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. శక్తి యాప్ను ఇంస్టాల్ చేపించాలని కోరారు. #RAJESH 
    0 Comments 0 Shares 34 Views 0 Reviews
  • మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సరిహద్దు ఒడిశా ప్రాంతం సందుబడిలో AES సంతోష్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ మేరకు ఒడిశా ఎక్సైజ్ పోలీసులతో సంయుక్తంగా చేపట్టిన దాడులలో 26,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 420 లీటర్ల సారా, 50 కేజీల అమ్మోనియా స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి ఓ వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. టాస్క్ ఫోర్స్, మొబైల్ పార్టీ, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.
    #RAJESH
    మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సరిహద్దు ఒడిశా ప్రాంతం సందుబడిలో AES సంతోష్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ మేరకు ఒడిశా ఎక్సైజ్ పోలీసులతో సంయుక్తంగా చేపట్టిన దాడులలో 26,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 420 లీటర్ల సారా, 50 కేజీల అమ్మోనియా స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి ఓ వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. టాస్క్ ఫోర్స్, మొబైల్ పార్టీ, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు. #RAJESH
    0 Comments 0 Shares 13 Views 0 0 Reviews
  • సాలూరు పురపాలక సంఘ పరిధిలో చేబోలు వీధి వద్ద బైపాస్ రోడ్డులో ఉన్న తాగునీటి పైప్ లైన్ రంధ్రం పడి నీరు వృథాగా పోతోంది. ఈ లీకేజీ వల్ల ప్రజలకు అందవలసిన తాగునీరు మురికి కాలువలోకి చేరుతుంది. వేద సమాజం వీధితోపాటు పలు వీధులకు నీటి కొరత ఏర్పడుతోంది. అధికారులు స్పందించి ఈ లీకేజీని అరికట్టి తాగునీరు కలుషితం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
    #RAJESH
    సాలూరు పురపాలక సంఘ పరిధిలో చేబోలు వీధి వద్ద బైపాస్ రోడ్డులో ఉన్న తాగునీటి పైప్ లైన్ రంధ్రం పడి నీరు వృథాగా పోతోంది. ఈ లీకేజీ వల్ల ప్రజలకు అందవలసిన తాగునీరు మురికి కాలువలోకి చేరుతుంది. వేద సమాజం వీధితోపాటు పలు వీధులకు నీటి కొరత ఏర్పడుతోంది. అధికారులు స్పందించి ఈ లీకేజీని అరికట్టి తాగునీరు కలుషితం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. #RAJESH
    0 Comments 0 Shares 11 Views 0 0 Reviews
  • 0 Comments 0 Shares 24 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 24 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 23 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com