₹5000 కోట్లతో మూసీ నది ఒడ్డున భారీ గాంధీ విగ్రహం పెట్టనున్న రేవంత్ ప్రభుత్వం .|

0
147

 

 

హైదరాబాద్ :  ప్రజల నుండి , ప్రజా సంఘాల నుండి, పర్యావరణవేత్తల నుండి, రాజకీయ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో ముందుకే పోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.

 

అందుకే ఇంకా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కాకున్నా, ఏషియన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు రుణం మంజూరు చేయకున్నా హడావిడిగా మూసీ నది ఒడ్డున రూ. 5000 కోట్లు వెచ్చించి దేశంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని నిర్మించే పనికి ఫిబ్రవరి నెలలోనే శంకుస్థాపన చేయనున్న కాంగ్రెస్ సర్కారు.

 

దీని కోసం ఈసి, మూసీ నదుల సంగమం వద్ద ఉన్న పది ఎకరాల భూసేకరణకు మొన్ననే తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 

 

ఈ ప్రాజెక్టు కోసం 3,279 ఎకరాలు, 10,017 ఇండ్లు, షాపులు సేకరించనున్నారు

 

అయితే నోటిఫికేషన్ ఇచ్చిన భూమిలో మధు పార్క్ రిడ్జ్ అపార్టుమెంట్ కాంప్లెక్స్ లో నివసించే సుమారు 500 కుటుంబాలు ఈ నిర్ణయంతో రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది.

 

 ఒక విగ్రహం కోసం 5000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడమే తప్పు. దాని కొరకు తమ రెక్కల కష్టంతో అపార్ట్మెంట్ కొనుక్కున్న 500 కుటుంబాలను రోడ్డున పడేయడం దుర్మార్గమైన చర్య... అని ప్రజలు మండిపడుతున్నారు.

 

రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయడానికి, అభివృద్ధి పనులకు డబ్బులు లేవంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  కృత్రిమ బీచ్, మిస్ వరల్డ్ అందాల పోటీలు, గ్లోబల్ సమ్మిట్ వంటి వాటికి వందల వేల కోట్ల వృధా ఖర్చు. అని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

 

రైతుబంధు కోసం డబ్బు లేదంటున్న ఈ  ముఖ్యమంత్రికి ఒక విగ్రహం కోసం రూ 5000 కోట్లు ఖర్చు అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Telangana
Actor pratyusha case supreme Court judgememt
నటి ప్రత్యూష మృతి కేసులో తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు   టాలీవుడ్ సినీ నటి...
By G k Nookala 2026-02-17 13:33:52 0 128
Meghalaya
Banks Closed in Meghalaya on July 17 for U Tirot Sing’s Death Anniversary
On July 17, 2025, banks across Meghalaya—including SBI branches—remained closed to...
By Bharat Aawaz 2025-07-17 07:00:50 0 990
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో రెండు...
By Benguluri Madhubabu 2026-02-02 07:23:44 0 190
Telangana
బీసీ హక్కుల కోసం బంద్‌కు బీఆర్‌ఎస్ మద్దతు – 42% కోటా కోసం పోరాటానికి బలం
బీసీ (పిన్న వర్గాల) సంఘాలు తమ న్యాయమైన హక్కుల కోసం అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు...
By Bharat Aawaz 2025-10-16 09:57:11 0 719
Andhra Pradesh
సోమల లో హిందూ సమ్మేళనం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో వక్తలు హైందవ ధర్మాన్ని...
By Kothuru Murali 2026-01-04 11:04:19 0 134
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com