₹5000 కోట్లతో మూసీ నది ఒడ్డున భారీ గాంధీ విగ్రహం పెట్టనున్న రేవంత్ ప్రభుత్వం .|

0
179

 

 

హైదరాబాద్ :  ప్రజల నుండి , ప్రజా సంఘాల నుండి, పర్యావరణవేత్తల నుండి, రాజకీయ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో ముందుకే పోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.

 

అందుకే ఇంకా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కాకున్నా, ఏషియన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు రుణం మంజూరు చేయకున్నా హడావిడిగా మూసీ నది ఒడ్డున రూ. 5000 కోట్లు వెచ్చించి దేశంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని నిర్మించే పనికి ఫిబ్రవరి నెలలోనే శంకుస్థాపన చేయనున్న కాంగ్రెస్ సర్కారు.

 

దీని కోసం ఈసి, మూసీ నదుల సంగమం వద్ద ఉన్న పది ఎకరాల భూసేకరణకు మొన్ననే తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 

 

ఈ ప్రాజెక్టు కోసం 3,279 ఎకరాలు, 10,017 ఇండ్లు, షాపులు సేకరించనున్నారు

 

అయితే నోటిఫికేషన్ ఇచ్చిన భూమిలో మధు పార్క్ రిడ్జ్ అపార్టుమెంట్ కాంప్లెక్స్ లో నివసించే సుమారు 500 కుటుంబాలు ఈ నిర్ణయంతో రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది.

 

 ఒక విగ్రహం కోసం 5000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడమే తప్పు. దాని కొరకు తమ రెక్కల కష్టంతో అపార్ట్మెంట్ కొనుక్కున్న 500 కుటుంబాలను రోడ్డున పడేయడం దుర్మార్గమైన చర్య... అని ప్రజలు మండిపడుతున్నారు.

 

రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయడానికి, అభివృద్ధి పనులకు డబ్బులు లేవంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  కృత్రిమ బీచ్, మిస్ వరల్డ్ అందాల పోటీలు, గ్లోబల్ సమ్మిట్ వంటి వాటికి వందల వేల కోట్ల వృధా ఖర్చు. అని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

 

రైతుబంధు కోసం డబ్బు లేదంటున్న ఈ  ముఖ్యమంత్రికి ఒక విగ్రహం కోసం రూ 5000 కోట్లు ఖర్చు అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Telangana
పత్తి కొనుగోళ్లలో కేంద్ర బీజేపీ - రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ల నిర్లక్ష్య వైఖరి,
  పత్తి రైతుకు కన్నీరే మిగిల్చింది.   రైతులు నేరుగా మార్కెట్ కు తెచ్చే పత్తికి అనేక...
By Prashanth Goindla 2025-12-22 07:43:53 0 310
Legal
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:21:24 0 569
Andhra Pradesh
సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథులుగాCM చంద్రబాబు నాయుడు
*పత్రికా ప్రకటన* *విజయవాడ, తేదీ: 22.12.2025*   స్థానిక మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ లో ఏపీ...
By Rajini Kumari 2025-12-23 07:46:53 0 159
Andhra Pradesh
రాయచోటి పట్టణంలో నూతన పార్కు పనులను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలో మున్సిపల్ నిధులతో సుమారు 47 లక్షలతో జరుగుతున్న నూతన పార్కు పనులను...
By Benguluri Madhubabu 2026-04-16 11:28:07 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com