ఘనంగా చత్రపతి శివాజీ 396 వ జయంతి ఉత్సవాలు.|

0
175

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 వ జయంతి  వేడుకలు అల్వాల్‌ పరిధిలో అత్యంత వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నేతలు, శివ భక్తులతో కలిసి ఆయన శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దేశం పరాయి పాలనలో మగ్గిపోతున్న సమయంలో ధైర్యసాహసాలతో 'స్వరాజ్యాన్ని' స్థాపించిన గొప్ప వీరుడు శివాజీ అని కొనియాడారు. కేవలం యుద్ధ తంత్రంలోనే కాకుండా, ప్రజల సంక్షేమం కోసం అద్భుతమైన పరిపాలన అందించిన మహనీయుడని పేర్కొన్నారు. నేటి యువత శివాజీ మహారాజ్ ఆశయాలను అలవర్చుకుని, దేశభక్తితో ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను చాటిచెప్పేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో  మల్కాజ్గిరి అసెంబ్లీ కన్వీనర్ మల్లికార్జున్ గౌడ్. మేడ్చల్ జిల్లా అర్బన్ సెక్రటరీ చింతల మాణిక్య రెడ్డి,   డివిజన్ ల ప్రసిడెంట్ లు, కార్తిక్ గౌడ్. శ్రీదర్ రెడ్డి. అజయ్ రెడ్డి. తూప్రాన్ లక్ష్మణ్. అనిల్. కరుణశ్రీ. సుజాత.రవి కిరణ్. రాజేంద్రప్రసాద్. మరియు బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
జాతీయ విలువిద్య పోటీలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం
మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర యువజన రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...
By Benguluri Madhubabu 2026-03-24 12:03:13 0 169
Andhra Pradesh
మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు
మహాశివరాత్రి మహోత్సవానికి ఏర్పాట్లు... త్రిపురాంతకం మండలం, త్రిపురాంతకం గ్రామంలో గల శ్రీ...
By Chennaiah Kati 2026-01-22 13:03:41 0 268
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : గడ్డి మందు తాగిన యువకుడు మృతి
పుంగనూరు నియోజక వర్గం, చౌడేపల్లి మండలం, చిట్టిరెడ్డిపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న సతీష్ (25)...
By Kothuru Murali 2026-01-29 08:54:41 0 134
Andhra Pradesh
మంగళగిరి ఫ్లైఓవర్ పై తప్పని ట్రాఫిక్ కష్టాలు
*మంగళగిరి ఫ్లై ఓవర్ పై తప్పని ట్రాఫిక్ కష్టాలు*   *సెలవు దినం అయిన మంగళగిరి ఫ్లై ఓవర్ పై...
By Rajini Kumari 2025-12-30 12:23:19 0 148
Andhra Pradesh
ఒకే మండలంలో రెవెన్యూ సిబ్బందిపై చర్యలు.
ఏపీ ప్రభుత్వం ఒకే మండలంలో పనిచేసిన అధికారులు, ఉద్యోగుల సహా 21మందిపై చర్యలకు ఆదేశించింది. 2020...
By John Baji 2025-12-31 05:49:13 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com