ఘనంగా చత్రపతి శివాజీ 396 వ జయంతి ఉత్సవాలు.|

0
176

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 వ జయంతి  వేడుకలు అల్వాల్‌ పరిధిలో అత్యంత వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నేతలు, శివ భక్తులతో కలిసి ఆయన శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దేశం పరాయి పాలనలో మగ్గిపోతున్న సమయంలో ధైర్యసాహసాలతో 'స్వరాజ్యాన్ని' స్థాపించిన గొప్ప వీరుడు శివాజీ అని కొనియాడారు. కేవలం యుద్ధ తంత్రంలోనే కాకుండా, ప్రజల సంక్షేమం కోసం అద్భుతమైన పరిపాలన అందించిన మహనీయుడని పేర్కొన్నారు. నేటి యువత శివాజీ మహారాజ్ ఆశయాలను అలవర్చుకుని, దేశభక్తితో ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను చాటిచెప్పేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో  మల్కాజ్గిరి అసెంబ్లీ కన్వీనర్ మల్లికార్జున్ గౌడ్. మేడ్చల్ జిల్లా అర్బన్ సెక్రటరీ చింతల మాణిక్య రెడ్డి,   డివిజన్ ల ప్రసిడెంట్ లు, కార్తిక్ గౌడ్. శ్రీదర్ రెడ్డి. అజయ్ రెడ్డి. తూప్రాన్ లక్ష్మణ్. అనిల్. కరుణశ్రీ. సుజాత.రవి కిరణ్. రాజేంద్రప్రసాద్. మరియు బీజేపీ, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త!* 🎉 న్యూ ఇయర్ & సంక్రాంతి సందర్భంగా...
By KOTESWARARAO KVSR 2025-12-24 14:15:42 0 219
Telangana
జన్ ఔషధి కేంద్రాల బలోపేతానికి కీలక సూచనలు.. ఎంపీ ఈటెల.|
హైదరాబాద్ :పార్లమెంట్‌లో రూల్ 377 కింద ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్...
By Sidhu Maroju 2026-04-01 17:54:09 0 147
Telangana
నేటి నుంచి ATM నిబంధనలలో మార్పులు
నేటి నుంచి ATM నిబంధనలలో మార్పులు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావడంతో ఏటీఎం...
By Pinnehasan Odela 2026-04-01 07:14:57 0 137
Andhra Pradesh
గుంటూరు కాకాని రోడ్ లో అగ్నిప్రమాదం
గుంటూరు కాకాని రోడ్ లో వాసవి కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం. Short Circuit వాళ్ళ షాప్ లో నీ బట్టలు...
By Kola Kirankumar 2026-04-29 10:13:34 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com