నిరంతరాయమైన విద్యుత్ ను అందిచడమై లక్ష్యం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే MMకొండయ్య.

0
147
చీరాల: విద్యుత్ రంగానికి కూటమి సర్కార్ పెద్ద పీట.
నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌ తో చీరాల పట్టణంతో పాటుగా పరిసర ప్రాంతాలలోని ప్రజలకు నిరంతరాయమైన,నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు గాను ఎంతగానోదోహదపడుతుందని చీరాల ఎమ్మెల్యే MMకొండయ్య అన్నారు.బుధవారం చీరాల మున్సిపల్ పరిదిలోని జయంతిపేటలో 4.5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 33/11 KV సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులకు బుధవారం చీరాల ఎమ్మెల్యే MMకొండయ్య భూమి పూజ చేశారు.ఈసందర్భంగా అయన మాట్లాడుతూ ఈ సబ్‌స్టేషన్ నిర్మాణంతో చీరాల పట్టణంలోని స్థానికంగా ఉన్న జయంతిపేటను మొదలుకొని,హరిప్రసాద్ నగర్ ,విఠల్ నగర్,గాంధీ నగర్ ,జై ప్రకాష్ నగర్,దండుబాట, వైకుంఠపురం,స్వర్ణ గేటు తదితర ప్రాంతాల పరిధిలోని విద్యుత్ వినియేగదారులకు విద్యుత్ కోతలు , లో ఓల్టేజ్ సమస్యకు శాశ్వితంగా పరిష్కారం లభించినట్లేనన్నారు.ఇప్పటి వరకు ఈప్రాంత ప్రజలు ఓవర్ లోడ్ కారణంగా విద్యుత్ కోతలతో ఇబ్బందిపడిన క్రమంలో,,విద్యుత్ సబ్‌స్టేషన్‌కు అందుబాటులోకి వేస్తె ఓవర్ లోడ్ సమస్యకు సైతం చెక్ పడినట్లేనన్నారు.ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించే క్రమంలో కూటమి ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ లో సైతం పెద్ద ఎత్తున విద్యుత్ రంగానికి కేటాయిపులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఇక ఇదే క్రమంలో సోలార్ వినియోగం పైన ప్రజలు దృష్టి సారించాలని ఎమ్మెల్యే కొండయ్య సూచించారు. 2 kW నుంచి 3 kW సామర్థ్యం గల సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం రూ. 60,000 నుంచి రూ. 78,000 వరకు సబ్సిడీ ఇస్తుందన్నారు.సోలార్ ప్యానెల్స్ ద్వారా మన అవసరాలకన్నా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అయితే,ఆ విద్యుత్ ను ప్రభుత్వానికి అమ్ముకోవచ్చన్నారు.కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ సూపర్నెంట్ ఇంజనీర్ ఆంజనేయులు, చీరాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాన్ తామస్,చీరాల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరిప్రసాద్ చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
ఎర్నాకుళం వెళ్లే రైలులో అనకాపల్లి దగ్గర అగ్నిప్రమాదం ఒకరు మృతి రెండు ఏసీ బోగీలు దగ్ధం
*Train Fire: అనకాపల్లి దగ్గర రైలులో అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు దగ్ధం.. ఒకరు మృతి*  ...
By Rajini Kumari 2025-12-29 08:36:02 0 213
Telangana
నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల
నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల గలగలలు చూసి మనసు పులకించిన సందర్భం ,అపర భగీరథుడు...
By Ponnala Srinivasrao 2026-03-22 03:26:32 0 168
Telangana
అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ...ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతులను చేపట్టి పూర్తిచేస్తాం : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 22వ వార్డుకు...
By Sidhu Maroju 2025-06-12 11:39:04 0 1K
Andhra Pradesh
మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ. - శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషను పంపిణీ.
నెల్లూరు  కావలి పట్టణం శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుడు యునైటెడ్...
By Ratna Sekhar 2026-03-10 19:42:07 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com