బాపట్లలో రెడ్ క్రాస్ ట్రైనింగ్ ఛాంబర్ ప్రారంభోత్సవం బాధితుల చిరునామా రెడ్ క్రాస్: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
Posted 2026-02-17 16:16:55
0
203
బాపట్ల జిల్లా: బాధిత జనావళికి అండగా, వారికి బాసటగా రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిరూపమాన సేవలు అందిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. విశిష్టమైన సేవా కార్యక్రమాల ద్వారా రాష్ట్రస్థాయిలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ కు గుర్తింపు రావడం హర్షణీయమని పేర్కొన్నారు. బాపట్ల తాహసిల్దార్ కార్యాలయం వద్ద రెడ్ క్రాస్ ట్రైనింగ్ ఛాంబర్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో రెడ్ క్రాస్ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో విస్తరించేలా జరుగుతున్న కృషి అభినందనీయమని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఇందులో జిల్లా చైర్మన్ నారాయణ భట్టు అందిస్తున్న సేవలు అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు. ప్రకృతి వికృత రూపానికి తల్లడిల్లే ప్రాంతాల్లో నేను సైతం అంటూ రెడ్ క్రాస్ ముందుండి సేవలు అందిస్తుందని అన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు భోజన ఏర్పాట్లు చేయటం ద్వారా మరింత గుర్తింపును సంపాదించుకుందని తెలిపారు. బ్లడ్ బ్యాంకు ద్వారా ఇప్పటికే
రెడ్ క్రాస్ మంచి గుర్తింపును సాధించిందని చెప్పారు. ఇదే సందర్భంగా ప్రజలకు మంచి సేవలు అందించే ప్రత్యామ్నాయ సేవలపై కూడా రెడ్ క్రాస్ దృష్టి పెట్టాలని కలెక్టర్ అన్నారు. రాష్ట్రస్థాయిలో సభ్యత్వ నమోదులో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ కు అవార్డు రావడం సంతోషకరమన్నారు. జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లో మంచి సేవలతో గుర్తింపు పొందిన రెడ్ క్రాస్ కు అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలకు సేవలు మరింత విస్తరింప చేసే కార్యకలాపాల కోసం అనువైన భవనాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల ఆర్డిఓ గ్లోరియా, తాసిల్దార్ షేక్ షలీమ, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నారాయణ భట్టు తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ కు సహకరిస్తున్న దాతలను ఈ సందర్భంగా కలెక్టర్ సన్మానించారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్: పద్మశాలి సంఘం నూతనకమితి ప్రమాణ స్వికారం
నగరంలోని ఎల్లమ్మగుట్ట పద్మశాలి సంఘం ( తర్ప నం 32 ) నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో...
గ్రంధాలయాల ను విద్యార్థులు వినియోగించుకోవాలి
చిలుకూరు, గ్రంధాలయాలు విజ్ఞాన కేంద్రాలని ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ...
"అలై బలైతో హృదయాలను కలిపిన దత్తన్న". జన్మదిన శుభాకాంక్షలు.|
హైదరాబాద్ : రాజకీయాల్లో పదవులు సంపాదించడం కంటే ప్రజల మనసులు గెలుచుకోవడం గొప్ప విషయం. అలాంటి...
Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ బేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 10.30 గంటలకు కేబినెట్ సమావేశం
వివిధ కీలక అంశాలపై చర్చించి...
మిద్దెపై నుంచి పడి ఎంబీఏ విద్యార్థికి తీవ్ర గాయాలు.
పుంగనూరు మండలం కుక్కలపల్లిలో ఎంబీఏ విద్యార్థి గంగరాజు (24) తన స్నేహితుడి ఇంట్లో మిద్దెపై...