తిరునాళ్ళలో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన జిల్లా పోలీస్ అధికారులు.

0
127
 
బాపట్ల జిల్లా: బాపట్ల ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. చీరాల డీఎస్పీ ఎమ్.డి.మోయిన్ ఆధ్వర్యంలో చిన్నగంజాం పోలీస్ స్టేషన్ పరిధిలో శివరాత్రి సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా స్థానిక పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. తిరునాళ్లకు విచ్చేసిన భక్తులలో వేరువేరు ఘటనలలో తప్పిపోయిన చిన్నపిల్లలను చీరాల డిఎస్పీ గారు క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. శివరాత్రి నాడు భట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామంలోని శ్రీ కేదారేశ్వర వాయులింగ దేవస్థానం వద్ద భట్టిప్రోలు ఎస్ఐ శివయ్య గారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన భద్రత ఏర్పాట్లు చేశారు. తిరునాళ్లకు విచ్చేసిన భక్తులలో ముగ్గురు చిన్నపిల్లలు వేరువేరుగా సంఘటనలలో తప్పుపోయినారు. సమాచారం తెలుసుకున్న భట్టిప్రోలు ఎస్ఐ వేగంగా స్పందించి కొన్ని నిమిషాల వ్యవధిలోనే వారిని గుర్తించి.. క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
 
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
Sub register get promotion to registarar.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్,...
By G k Nookala 2026-02-18 09:56:22 0 123
Andhra Pradesh
పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న గద్దె రామ్మోహన్
ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం -ఏపీఐఐసీ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమంలో...
By Rajini Kumari 2025-12-21 12:30:02 0 172
Andhra Pradesh
రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని జనసేన నాయకుడి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.
మదనపల్లెలో శ్రీరామనవమి పండగ సందర్భంగా, ప్రముఖ సినీ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరగా...
By Pagadala Venkateswar 2026-03-28 04:18:43 1 106
Andhra Pradesh
నందివెలుగు రోడ్డులో కల్వర్టు నిర్మాణానికి అనుమతులివ్వండి.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నందివెలుగు రోడ్డులో జాకీర్ హుస్సేన్ నగర్ వద్ద కల్వర్టు...
By John Baji 2026-01-23 01:53:03 0 147
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com