తిరునాళ్ళలో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన జిల్లా పోలీస్ అధికారులు.
Posted 2026-02-17 16:05:42
0
206
బాపట్ల జిల్లా: బాపట్ల ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. చీరాల డీఎస్పీ ఎమ్.డి.మోయిన్ ఆధ్వర్యంలో చిన్నగంజాం పోలీస్ స్టేషన్ పరిధిలో శివరాత్రి సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా స్థానిక పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. తిరునాళ్లకు విచ్చేసిన భక్తులలో వేరువేరు ఘటనలలో తప్పిపోయిన చిన్నపిల్లలను చీరాల డిఎస్పీ గారు క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. శివరాత్రి నాడు భట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామంలోని శ్రీ కేదారేశ్వర వాయులింగ దేవస్థానం వద్ద భట్టిప్రోలు ఎస్ఐ శివయ్య గారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన భద్రత ఏర్పాట్లు చేశారు. తిరునాళ్లకు విచ్చేసిన భక్తులలో ముగ్గురు చిన్నపిల్లలు వేరువేరుగా సంఘటనలలో తప్పుపోయినారు. సమాచారం తెలుసుకున్న భట్టిప్రోలు ఎస్ఐ వేగంగా స్పందించి కొన్ని నిమిషాల వ్యవధిలోనే వారిని గుర్తించి.. క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
BITS Pilani: ఏపీ రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ... సీఆర్డీఏతో కీలక ఒప్పందం.
బిట్స్ పిలానీ ఏర్పాటుకు తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో 70 ఎకరాలు కేటాయించిన...
Jaipur Flight Makes Emergency Landing After Bird Hit
A full flight departing from Jaipur International Airport was forced to make an emergency landing...
అనంతపురం :ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్
అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే " 𝟴𝘁𝗵 𝗦𝗛𝗢𝗥𝗧 𝗙𝗜𝗟𝗠 𝗙𝗘𝗦𝗧𝗜𝗩𝗔𝗟 " పోస్టర్ ను ఈ రోజు...
PF Registration for Employee Retirement Benefits
Provident Fund (PF) Registration is a mandatory requirement for eligible establishments under the...
ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలకు సమాజంలో భద్రత కల్పించేది పోలీసులే. పోలీసులు లేని సమాజాన్ని...