ట్రాక్టర్ బోల్తా-బాలుడు మృతి

0
200

ట్రాక్టర్ బోల్తా – బాలుడు మృతి

పాత అన్న సముద్రంలో విషాద ఘటన

మార్కాపురం జిల్లా, త్రిపురాంతకం మండలం, పాత అన్న సముద్రం గ్రామం, ఫిబ్రవరి 17 (ప్రతినిధి):

మండలంలోని పాత అన్న సముద్రం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పసుపులేటి వెంకట చంద్రశేఖర్ అనే బాలుడు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు.

స్థానికుల వివరాల ప్రకారం, ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ నడుపుతున్న సమయంలో అదుపుతప్పి సమీపంలోని కాలువలోకి బోల్తా పడింది. డ్రైవింగ్ సరిగా చేయలేకపోవడం వల్ల ట్రాక్టర్ ఒరిగిపోయి బాలుడు ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ప్రమాదం గమనించిన గ్రామస్తులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ట్రాక్టర్‌ను పైకి లేపి బాలుడిని బయటికి తీశారు. అయితే అప్పటికే అతను మృతిచెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.వ్యవసాయ పనుల సమయంలో సరైన జాగ్రత్తలు పాటించాలని, అనుభవం లేని వారు వాహనాలు నడపరాదని అధికారులు సూచిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సమాన జీతం - శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి
దిన కూలీలకు.హోటల్ లో పని చేసేవారికి. టైం స్కే ఎల్. మధ్యాహ్న భోజన కార్మికులు. అంగన్వాడీ...
By Mobbu Venkatramana 2026-03-02 12:59:37 0 174
Andhra Pradesh
మదనపల్లిలో భర్తపై భార్య కత్తితో దాడి – హత్యాయత్నం.
మదనపల్లి మండలంలో గురువారం ఉదయం భార్య శ్యామల, మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్త మల్లూరి సుబ్రహ్మణ్యం...
By Pagadala Venkateswar 2026-02-12 06:00:44 0 83
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com