ట్రాక్టర్ బోల్తా-బాలుడు మృతి

0
202

ట్రాక్టర్ బోల్తా – బాలుడు మృతి

పాత అన్న సముద్రంలో విషాద ఘటన

మార్కాపురం జిల్లా, త్రిపురాంతకం మండలం, పాత అన్న సముద్రం గ్రామం, ఫిబ్రవరి 17 (ప్రతినిధి):

మండలంలోని పాత అన్న సముద్రం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పసుపులేటి వెంకట చంద్రశేఖర్ అనే బాలుడు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు.

స్థానికుల వివరాల ప్రకారం, ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ నడుపుతున్న సమయంలో అదుపుతప్పి సమీపంలోని కాలువలోకి బోల్తా పడింది. డ్రైవింగ్ సరిగా చేయలేకపోవడం వల్ల ట్రాక్టర్ ఒరిగిపోయి బాలుడు ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ప్రమాదం గమనించిన గ్రామస్తులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ట్రాక్టర్‌ను పైకి లేపి బాలుడిని బయటికి తీశారు. అయితే అప్పటికే అతను మృతిచెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.వ్యవసాయ పనుల సమయంలో సరైన జాగ్రత్తలు పాటించాలని, అనుభవం లేని వారు వాహనాలు నడపరాదని అధికారులు సూచిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాలలో అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణం.. జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం – స్థానికుల ఆందోళన
చీరాల: చీరాల పట్టణంలోని వుడ్ నగర్ ప్రాంతంలో అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారనే...
By Gadiyapudi Narendra 2026-03-03 05:28:15 0 203
Andhra Pradesh
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోట్ల !!
కర్నూలు : నంద్యాల : డోన్ : డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ...
By Hari Krishna 2026-01-18 10:06:20 0 105
Andhra Pradesh
పుంగనూరు:వీరాంజనేయ స్వామి రథాన్ని లాగిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలో హనుమంతరాయదిన్నెలో జరుగుతున్న శ్రీ వీరాంజనేయ స్వామి...
By Kothuru Murali 2026-03-29 07:39:55 0 80
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com