రాణి గారి తోట వాటర్ ట్యాంకులు త్వరలో ప్రజలకు అందజేయాలని విజ్ఞప్తి

0
199

*విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ*

*17-02-2026*

 

 

 

*రాణి గారి తోట లోగల వాటర్ ట్యాంక్ నీరు ను ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోండి*

 

 

*విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు*

 

 

 

రాణి గారి తోట లోగల నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ ను త్వరగా పూర్తిచేసి, అందుబాటులో తీసుకొచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రాణి గారి తోట, కృష్ణలంక ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాణి గారి తోట లో నిర్మిస్తున్న 1000 కి.లీ . సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసి ప్రజలకు త్వరగా మంచినీటి సరఫరా ఆ ట్యాంకు ద్వారా అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు. అమృత్ 2.0 పథకం కింద చేస్తున్న ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించాలని అన్నారు. కృష్ణలంక నేషనల్ హైవే లో గ్రీన్ బెల్ట్ ను పెంచాలని ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణ అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

 తదుపరి రాణి గారి తోటలో గల అన్న క్యాంటీను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి, వాడుకనీటి సరఫరా లో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఏవైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు.

 

 

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కే షమ్మీ, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.సామ్రాజ్యం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్రీయ విద్యాలయం, మదనపల్లిలో అడ్మిషన్లు ప్రారంభం.
మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి....
By Pagadala Venkateswar 2026-03-21 06:05:04 0 198
Telangana
ఇంకా ఎన్నాళ్లు ఇతరుల పెళ్లికి డాన్స్లు... రాజా సింగ్
ఆమ్మో ఆ రాష్ట్రంలో అధికారమా., అసలే రాదు చాలా కష్టం అనుకున్న రాష్ట్రంలో కూడా అధికారం భారీ...
By Ponnala Srinivasrao 2026-05-06 05:00:59 0 150
Andhra Pradesh
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్ మెసేజ్!
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్...
By Pagadala Venkateswar 2026-02-01 10:55:04 0 162
Telangana
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ పాల్ .|
హైదరాబాద్ : 2024తో పోలిస్తే 25లో 2 శాతం తగ్గిన ఇళ్లు, ప్లాట్ల అమ్మకాలు. మరోవైపు దేశంలోని ప్రధాన...
By Sidhu Maroju 2026-01-05 09:37:05 0 199
Telangana
రెండు బైకలు డికొన్నాయి
సంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా...
By Gandla Vaijanath 2026-06-04 07:31:03 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com