Chandrababu Naidu: చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ.. సచివాలయంలో కీలక సమావేశం.

0
35

అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ 

గేట్స్ బృందంతో సమావేశమైన సీఎం చంద్రబాబు, మంత్రులు

ఆర్టీజీఎస్‌ను సందర్శించనున్న బిల్ గేట్స్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్..అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరితో బిల్ గేట్స్ బృందం సమావేశమైంది. 

 

ఈ సందర్భంగా బిల్ గేట్స్ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఎస్) ను సందర్శించనున్నారు. ఆర్టీజీఎస్ విధానాలు, అమలు తీరుతో పాటు సాధిస్తున్న ఫలితాలను గేట్స్‌కు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. అలాగే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై కీలక చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న సంజీవని ప్రాజెక్టు గురించి సీఎం బిల్ గేట్స్‌కు ప్రత్యేకంగా వివరించనున్నట్లు సమాచారం.

 

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం యడవల్లి గ్రామంలో ఇరువర్గాలు మధ్య పోరు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం యడవల్లి గ్రామంలో రెండు వర్గాల పోరు మధ్య గొడవ దోర్నాల యడవల్లి...
By Chennaiah Kati 2026-01-02 05:53:19 0 286
Andhra Pradesh
Lakshmi Deepika: లక్ష్మీదీపిక ‘డబుల్’ ధమాకా: తెలంగాణ తర్వాత ఏపీ గ్రూప్-1లోనూ స్టేట్ టాపర్!
రెండు రాష్ట్రాల్లోనూ మొదటి ర్యాంకు సాధించిన ఘనత ఉస్మానియాలో ఎంబీబీఎస్.. ఇప్పుడు డిప్యూటీ...
By Pagadala Venkateswar 2026-02-01 08:33:38 0 29
Andhra Pradesh
తూర్పు నియోజకవర్గం ప్రజా దర్బార్లో వినతి పత్రాలు స్వీకరణ కార్పొరేటర్ మమ్ము నేని ప్రసాద్
*ప్రజా సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం* - *కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్* *తూర్పు కార్యాలయం...
By Rajini Kumari 2025-12-27 11:02:43 0 109
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com