Chandrababu Naidu: చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ.. సచివాలయంలో కీలక సమావేశం.

0
36

అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ 

గేట్స్ బృందంతో సమావేశమైన సీఎం చంద్రబాబు, మంత్రులు

ఆర్టీజీఎస్‌ను సందర్శించనున్న బిల్ గేట్స్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్..అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరితో బిల్ గేట్స్ బృందం సమావేశమైంది. 

 

ఈ సందర్భంగా బిల్ గేట్స్ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఎస్) ను సందర్శించనున్నారు. ఆర్టీజీఎస్ విధానాలు, అమలు తీరుతో పాటు సాధిస్తున్న ఫలితాలను గేట్స్‌కు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. అలాగే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై కీలక చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న సంజీవని ప్రాజెక్టు గురించి సీఎం బిల్ గేట్స్‌కు ప్రత్యేకంగా వివరించనున్నట్లు సమాచారం.

 

Search
Categories
Read More
Andhra Pradesh
గూడూరు పట్టణంలోలో ,ఏఐటీయూసీ కార్మిక సంఘాల మహాసభ ఘనంగా నిర్వహించారు. ఏఐటియుసి,
బహిరంగ సభకు, ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు, బీడీల శ్రీనివాసులు అధ్యక్షత వహించగా, ముఖ్య...
By mahaboob basha 2025-12-06 01:01:27 0 301
BMA
Build Your Network, Build Your Future – The Power of Professional Networking
In today’s fast-paced media world, talent alone isn’t enough. Opportunities grow...
By BMA ADMIN 2025-06-28 11:57:13 0 2K
Andhra Pradesh
రాష్ట్ర మైనార్టీల నమ్మకం కోల్పోయిన కూటమి ప్రభుత్వం
ప్రచునార్థం  19.1.26     *రాష్ట్రంలో మైనారిటీల నమ్మకాన్ని కోల్పోయిన...
By Rajini Kumari 2026-01-19 11:30:29 0 56
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com