Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి టీమ్ ను అభినందించిన సీఎం చంద్రబాబు.

0
182

ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా మెమోరియల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందన్న సీఎం చంద్రబాబు

 

ట్రస్ట్ 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు

తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ట్రస్ట్ చేస్తున్న సేవలు అసామాన్యమని ప్రశంస

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ట్రస్ట్ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

 

అధికారం అంటే పేదల సేవ అనే భావనతో ప్రజా సేవకు నిజమైన అర్థాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ గారి బాటలో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. విద్య, వైద్యం, రక్తదానం, విపత్తుల్లో సహాయం వంటి కార్యక్రమాల ద్వారా ట్రస్ట్ సమాజంలో తిరుగులేని ముద్ర వేసిందన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అసామాన్యమని ప్రశంసించారు. అలాగే మహిళా సాధికారత, జీవనోపాధి కల్పనలోనూ ట్రస్ట్ కీలక సేవలు అందిస్తోందని తెలిపారు. 

 

ట్రస్ట్ సేవలను మరింత విస్తరిస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, వారి బృందాన్ని చంద్రబాబు అభినందించారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలాగే కొనసాగుతూ కోట్ల మందికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Telangana
జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు;
నిర్మల్ జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ...
By Mittapelli Saketh 2026-01-01 11:12:20 0 563
Andhra Pradesh
ఆడ వేషంతో మోసాలు.. నిందితుడిపై కేసు నమోదు.
మదనపల్లె కేంద్రంగా ఆడవేషం వేసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు...
By Pagadala Venkateswar 2026-06-24 04:20:24 0 47
Andhra Pradesh
చీరాల మండలం, తోటవారిపాలెం గ్రామంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో  ముఖ్య అతిథిగా లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు పాల్గొన్నారు
చీరాల: చీరాల మండలం, తోటవారిపాలెం గ్రామంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో  ముఖ్య...
By Gadiyapudi Narendra 2025-12-24 17:23:06 0 234
Andhra Pradesh
బోయకొండలో రహస్య కోడిపందెం; 13 మందిని అరెస్ట్.
అన్నమయ్య జిల్లా బోయకొండ పరిసరాల్లోని వీకే రెసిడెన్సీ వెనుక రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందెంపై...
By Pagadala Venkateswar 2026-02-06 04:32:01 0 159
Telangana
ఖాళీగా ఉన్న ఫీలింగ్ స్టేషన్....
దుగ్గొండి మండలానికి చెందిన స్నేహ సాయి ఫీలింగ్ స్టేషన్లో మూడు రోజుల నుండి పెట్రోల్ మరియు డీజిల్...
By Gujile Ramu 2026-04-25 13:55:18 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com