Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి టీమ్ ను అభినందించిన సీఎం చంద్రబాబు.

0
143

ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా మెమోరియల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందన్న సీఎం చంద్రబాబు

 

ట్రస్ట్ 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు

తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ట్రస్ట్ చేస్తున్న సేవలు అసామాన్యమని ప్రశంస

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ట్రస్ట్ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

 

అధికారం అంటే పేదల సేవ అనే భావనతో ప్రజా సేవకు నిజమైన అర్థాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ గారి బాటలో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. విద్య, వైద్యం, రక్తదానం, విపత్తుల్లో సహాయం వంటి కార్యక్రమాల ద్వారా ట్రస్ట్ సమాజంలో తిరుగులేని ముద్ర వేసిందన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అసామాన్యమని ప్రశంసించారు. అలాగే మహిళా సాధికారత, జీవనోపాధి కల్పనలోనూ ట్రస్ట్ కీలక సేవలు అందిస్తోందని తెలిపారు. 

 

ట్రస్ట్ సేవలను మరింత విస్తరిస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, వారి బృందాన్ని చంద్రబాబు అభినందించారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలాగే కొనసాగుతూ కోట్ల మందికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Telangana
సామాన్య ప్రజలకు హక్కులు అందించిన మన రాజ్యాంగం- ప్రొఫెసర్ కోదండరాం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశ సామాన్య ప్రజలకు హక్కులు అందించినది మన రాజ్యాంగమని మాజీ శాసన...
By Sidhu Maroju 2025-11-26 15:38:01 0 150
Andhra Pradesh
రహదారుల రూపకల్పనకు నిర్మాణాత్మకమైన కృషి.-బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు వెల్లడి
బాపట్ల నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాలకు మహర్దశ కలిగింది. శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు...
By John Baji 2026-02-04 12:49:11 0 373
Telangana
హిందూ స్మశాన వాటిక సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని 133 డివిజన్ మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ...
By Sidhu Maroju 2025-06-16 18:38:55 0 1K
Andhra Pradesh
పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఐజి కోయ ప్రవీణ్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్ ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదివారం ఆకస్మికంగా...
By Kothuru Murali 2026-01-05 12:59:06 0 187
Andhra Pradesh
పుంగనూరు: ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి
విజయ కుమారి, శివ రత్నమ్మ గురువారం కలమందలవారిపల్లి ఎంపీపీ పాఠశాలలో వార్షికోత్సవానికి హాజరయ్యారు....
By Kothuru Murali 2026-04-22 14:38:03 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com