Chandrababu Naidu: లోకేశ్ పని లోకేశ్ చేస్తున్నాడు... నా పని నేను చేస్తున్నా: సీఎం చంద్రబాబు.

0
125

పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరును సమగ్రంగా విశ్లేషిస్తున్నామన్న సీఎం చంద్రబాబు

 

లోపాలను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు

ఎమ్మెల్యేల పనితీరుపై మరింత కఠినంగా పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడి

లోకేశ్ పని లోకేశ్ చేస్తున్నాడు.. నా పని నేను చేస్తున్నానంటూ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిన్న నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరును సమగ్రంగా విశ్లేషిస్తున్నామని, వారి పనిపై సర్వేలు నిర్వహించి వ్యక్తిగత నివేదికలను సీల్డ్ కవర్లలో అందజేస్తున్నామని వెల్లడించారు. ఈ నివేదికలు వారికి అద్దం పట్టినట్టుగా ఉంటాయని, లోపాలను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

 

తొమ్మిది ముఖ్య అంశాలపై అంచనా వేసి నివేదికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 1995 -96 మాదిరిగానే నిక్కచ్చిగా వ్యవహరిస్తానని పేర్కొన్న చంద్రబాబు .. సీల్డ్ కవర్లలో ఇచ్చే నివేదికల ద్వారా ఎమ్మెల్యేల బలాలు, బలహీనతలను స్పష్టంగా తెలియజేస్తున్నామని, మార్పు రాకపోతే నష్టం వాళ్లకేనని హెచ్చరించారు. ఇకపై ఎమ్మెల్యేల పనితీరుపై మరింత కఠినంగా పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.

 

ఇదే సందర్భంగా లోకేశ్ తన బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తున్నారని కితాబు ఇచ్చారు. ముఖ్యంగా మంగళగిరి చేనేత చీరలకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పించే ప్రయత్నాలను అభినందిస్తూ, ఇవి చేనేత రంగానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
వివేక్ వెంకటస్వామి ప్రెస్ మీట్ లో విదేశీ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసారు
మంచిర్యాలలోని తన నివాసంలో కార్మిక మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో సమావేశమై...
By Avunoori Mahesh 2026-04-15 11:02:33 0 165
Telangana
నిజామాబాద్.:కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును హర్షించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల...
తేదీ:23.04.2026. నిజామాబాద్.కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును హర్షించిన మాజీ ఎమ్మెల్యే...
By Sadaq Sadaq 2026-04-23 07:45:58 1 338
Andhra Pradesh
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ముబీనా*
గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్థిని, ముస్లిం మైనార్టీ...
By mahaboob basha 2025-10-25 14:12:09 0 254
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు...
By Kothuru Murali 2026-03-06 11:43:05 0 110
Andhra Pradesh
నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు మరియు సిమెంటుకాల్వలు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
గుంటూరు మిర్చి యార్డ్ సుబ్బారెడ్డి నగర్‌లో కెవిపి కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డు...
By John Baji 2026-01-02 02:40:30 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com