Chandrababu Naidu: లోకేశ్ పని లోకేశ్ చేస్తున్నాడు... నా పని నేను చేస్తున్నా: సీఎం చంద్రబాబు.

0
95

పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరును సమగ్రంగా విశ్లేషిస్తున్నామన్న సీఎం చంద్రబాబు

 

లోపాలను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు

ఎమ్మెల్యేల పనితీరుపై మరింత కఠినంగా పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడి

లోకేశ్ పని లోకేశ్ చేస్తున్నాడు.. నా పని నేను చేస్తున్నానంటూ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిన్న నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరును సమగ్రంగా విశ్లేషిస్తున్నామని, వారి పనిపై సర్వేలు నిర్వహించి వ్యక్తిగత నివేదికలను సీల్డ్ కవర్లలో అందజేస్తున్నామని వెల్లడించారు. ఈ నివేదికలు వారికి అద్దం పట్టినట్టుగా ఉంటాయని, లోపాలను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

 

తొమ్మిది ముఖ్య అంశాలపై అంచనా వేసి నివేదికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 1995 -96 మాదిరిగానే నిక్కచ్చిగా వ్యవహరిస్తానని పేర్కొన్న చంద్రబాబు .. సీల్డ్ కవర్లలో ఇచ్చే నివేదికల ద్వారా ఎమ్మెల్యేల బలాలు, బలహీనతలను స్పష్టంగా తెలియజేస్తున్నామని, మార్పు రాకపోతే నష్టం వాళ్లకేనని హెచ్చరించారు. ఇకపై ఎమ్మెల్యేల పనితీరుపై మరింత కఠినంగా పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.

 

ఇదే సందర్భంగా లోకేశ్ తన బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తున్నారని కితాబు ఇచ్చారు. ముఖ్యంగా మంగళగిరి చేనేత చీరలకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పించే ప్రయత్నాలను అభినందిస్తూ, ఇవి చేనేత రంగానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంస్టాగ్రామ్ మీ షో వర్క్ ఫ్రొం హోమ్ శాలరీ 30000 అప్లై నౌ సైబర్ మోసాలు
హౌస్ వైఫ్ చదువు రానివారు తెలిసి తెలియని ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త ఇలాంటి సైబర్ నేరాలు బారిన...
By Rajini Kumari 2025-12-26 06:11:22 0 180
Andhra Pradesh
గంజాయి విక్రయిస్తుల ముగ్గుల అరెస్ట్
మదనపల్లి రూరల్ సర్కిల్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు....
By Pagadala Venkateswar 2026-01-15 07:41:43 0 108
Andhra Pradesh
పుంగనూరు: అగ్నిప్రమాదంలో రూ 25 వేలు నష్టం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, హనుమంతరాయునిదిన్నెలో శుక్రవారం మామిడి తోటలో అగ్నిప్రమాదం...
By Kothuru Murali 2026-03-14 08:27:07 0 86
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు
తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత అమరావతి...
By Benguluri Madhubabu 2026-04-02 14:15:41 0 69
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com