మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు

0
215

*ప్ర‌చురణార్థం* *14-02-2026*

 

మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ స‌మేతంగా హాజరు

మంత్రి నివాసంలో సకుటుంబ సమేతంగా ప్ర‌జా ప్ర‌తినిధుల‌ ఆత్మీయ కలయిక

 

విజ‌య‌వాడ : గుంటూరు, విజయవాడ పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులతో ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), స‌తీమ‌ణి కేశినేని జాన‌కి ల‌క్ష్మీ, కుమారుడు కేశినేని వెంక‌ట్ తో కలిసి హాజరయ్యారు. 

 

శనివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో నిర్వహించిన ఆత్మీయ విందు స‌మావేశం లో ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబసభ్యులతో పాల్గొని, మంత్రి లోకేష్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. మంత్రి నారా లోకేష్ ఎంపీ కేశినేని శివ‌నాథ్ స‌తీమ‌ణి జాన‌కి ల‌క్ష్మీ కి మంగ‌ళ‌గిరి చేనేత చీర బ‌హుక‌రించారు. అలాగే యువ‌నాయ‌కుడు కేశినేని వెంక‌ట్ తో ప్ర‌త్యేకంగా మాట్లాడి భవిష్య‌త్ ప్ర‌ణాళిక‌లు అడిగి తెలుసుకుని త‌న స‌హ‌కారం ఎప్పుడు వుంటుంద‌ని తెలిపారు.

 

రాజకీయాలకు అతీతంగా కుటుంబ సభ్యుల బాగోగులు, పిల్లల విద్య, క్రీడలపై చర్చలు సాగిన ఈ కార్యక్రమంలో, అందరూ ఒకేచోట భోజనం చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడప‌టం, . త‌న‌ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆత్మీయ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజాప్రతినిధుల మధ్య స్నేహబంధాలను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. మంత్రి లోకేష్ ప్ర‌జాప్ర‌తినిధుల కుటుంబాల‌తో ఆత్మీయ విందు స‌మావేశ కార్య‌క్ర‌మం చేప‌ట్టి ఏపీ రాజ‌కీయాల్లో నూత‌న ఒర‌వ‌డికి శ్రీకారం చుట్టార‌ని కొనియాడుతూ...మంత్రి నారా లోకేష్ లో ఒక రాజ‌నీతిజ్ఞుడు క‌నిపిస్తున్నాడ‌ని ప్ర‌శంసించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Andhra Pradesh Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం
Free Bus Scheme : తెలుగు రాష్ట్రాల మహిళలు ప్రస్తుతం ఎలాంటి ఖర్చు లేకుండానే ఆర్టిసి బస్సుల్లో...
By Pagadala Venkateswar 2026-01-08 10:50:29 0 517
Andhra Pradesh
*సౌర విద్యుత్ కాంతులతో విరజిల్లిన పాలుట్ల గిరిజన గూడెం - సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు...*
*సౌర విద్యుత్ కాంతులతో విరజిల్లిన పాలుట్ల గిరిజన గూడెం - సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ప్రారంభించిన...
By Chennaiah Kati 2026-02-07 05:58:38 0 218
Andhra Pradesh
OTT సెన్సార్ బోర్డు వర్తించదు కేంద్రమంత్రి మురుగన్
*ఓటీటీలకు సెన్సార్ బోర్డు వర్తించదు: కేంద్ర మంత్రి మురుగన్*   డిజిటల్ వినోదంలో మార్పుల...
By Rajini Kumari 2025-12-18 08:36:58 0 198
Andhra Pradesh
ఎస్ ఐ ఆర్ అవగాహన సదస్సులో పాల్గొన్నా. మాసాపేట శివ
     ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న "SIR" (Special Intensive Revision)...
By Benguluri Madhubabu 2026-07-04 10:04:00 0 107
Andhra Pradesh
చిరువ్యాపారులకు టీడీపీ అండ: ఉచిత టార్పాలిన్ పంపిణీ
పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ఆదేశాల మేరకు,...
By Kothuru Murali 2026-05-19 15:17:03 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com