ఇంద్రకీలాద్రిపై బడ్జెట్ పత్రులకు ప్రత్యేక పూజలు

0
220

ప్రెస్ నోట్

 

తేదీ: 14 ఫిబ్రవరి, 2026

ఇంద్రకీలాద్రి.

 

ఇంద్రకీలాద్రిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు

 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, నేడు ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ వారి పాదాల చెంత బడ్జెట్ ప్రతులను ఉంచి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో ఈ క్రింది ఉన్నతాధికారులు పాల్గొన్నారు

శ్రీ పీయూష్ కుమార్ (IAS), ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ (PFS)

శ్రీ డి. రోనాల్డ్ రోస్ (IAS), కార్యదర్శి, ఆర్థిక శాఖ

శ్రీ సూరజ్ గనోరే (IAS)

శ్రీ గౌతమ్ అల్లాడ (IA&AS)

ఆలయానికి విచ్చేసిన అధికారులకు ఆలయ ఈవో శ్రీ శీనా నాయక్ ఘనస్వాగతం పలికి, వారిని అమ్మవారి సన్నిధికి తోడ్కొని వెళ్లారు. 

అర్చకులు బడ్జెట్ ప్రతులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం అధికారులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

 

దర్శనం అనంతరం అధికారులకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ నిర్విఘ్నంగా అమలు కావాలని అధికారులు ఈ సందర్భంగా ప్రార్థించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం: ఎమ్మెల్యే.
మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం నియోజకవర్గంలో సీఎం సహాయనిధి లబ్ధిదారులకు చెక్కులను...
By Pagadala Venkateswar 2026-04-16 03:24:26 0 127
Andhra Pradesh
వృద్ధుడిని బెదిరించి దోపిడి చేసిన ముద్దాయిని కేవలం 48 గంటల వ్యవధిలోనే అరెస్టు చేసి సొత్తు సుమారు 25000/ విలువల కలిగిన 2 బంగారు ఉంగరాలు రికవరీ చేసిన కొల్లిపర అరెస్టు చేసి పోలీస్ వారు
వృద్ధిడిని బెదిరించి దోపిడీ చేసిన ముద్దాయి ని కేవలం 48 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి చోరీ సొత్తు...
By Chennaiah Kati 2026-06-26 16:55:48 0 70
SURAKSHA
The Sentinel of Order: The Journey of Virender Singh
Integrity in Uniform: A Legacy of Steadfast Service: Shri. Virender Singh, a distinguished...
By Kalaga Sailaja 2026-07-18 13:34:32 0 41
Telangana
ఇంధన కొరత వార్తలు అవాస్తవం : తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టత.|
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంధన కొరత (Fuel Shortage) ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని...
By Sidhu Maroju 2026-03-25 06:46:00 0 173
Andhra Pradesh
'పోర్ట్‌కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలి'
పోర్ట్కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలని జిల్లా వైసీపీ నాయకులు పీరుపల్లి రాజశేఖర్ అన్నారు....
By Manda Ramkumar 2026-03-28 06:28:37 0 466
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com