దుర్గా మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
ప్రకటన
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు చేనేత పట్టు వస్త్రాల సమర్పణ
విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఫిబ్రవరి 14:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ మరియు మల్లేశ్వర స్వామి వార్లకు శనివారం ఉదయం పద్మశాలీ ప్రతినిధులు అత్యంత భక్తిశ్రద్ధలతో పట్టు వస్త్రాలను సమర్పించారు. రానున్న మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని, మంగళగిరి బహుత్తమ పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ విశేష కార్యక్రమం నిర్వహించబడింది.
శనివారం ఉదయం 11:25 గంటలకు ఆలయానికి చేరుకున్న సంఘ సభ్యులు, చేనేత కళాకారులు నైపుణ్యంతో రూపొందించిన మంగళగిరి పట్టు వస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ అధికారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంగళగిరి పద్మశాలీ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), సభ్యులు: అవ్వారు శ్రీనివాసరావు, మరియు గూడపాటి వెంకట సరోజినీ దేవి
జీవీ నాగేశ్వరరావు, జింకా లక్ష్మీదేవి, మన్నె కళావతి, మోరు స్రావణి, పద్మావతి ఠాకూర్, పనబాక భూలక్ష్మి, పెనుమత్స రాఘవరాజు, సుబ్రహ్మణ్య కుమార్ ఏలేశ్వరపు, సుకాసి సరిత, తంబళ్లపల్లి రమాదేవి, తోటకూర వెంకట రమణారావు, తరిగొప్పుల పార్వతి, ప్రత్యేక ఆహ్వానితులు మార్తి రామబ్రహ్మం, వెలగపూడి శంకర్ బాబు హాజరై, స్వామివార్ల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమములో పాల్గొనటం తమకు భాగ్యం కలగడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz