దుర్గా మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ

0
44

ప్రకటన

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు చేనేత పట్టు వస్త్రాల సమర్పణ

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఫిబ్రవరి 14:

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ మరియు మల్లేశ్వర స్వామి వార్లకు శనివారం ఉదయం పద్మశాలీ ప్రతినిధులు అత్యంత భక్తిశ్రద్ధలతో పట్టు వస్త్రాలను సమర్పించారు. రానున్న మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని, మంగళగిరి బహుత్తమ పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ విశేష కార్యక్రమం నిర్వహించబడింది.

శనివారం ఉదయం 11:25 గంటలకు ఆలయానికి చేరుకున్న సంఘ సభ్యులు, చేనేత కళాకారులు నైపుణ్యంతో రూపొందించిన మంగళగిరి పట్టు వస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ అధికారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంగళగిరి పద్మశాలీ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), సభ్యులు: అవ్వారు శ్రీనివాసరావు, మరియు గూడపాటి వెంకట సరోజినీ దేవి 

జీవీ నాగేశ్వరరావు, జింకా లక్ష్మీదేవి, మన్నె కళావతి, మోరు స్రావణి, పద్మావతి ఠాకూర్, పనబాక భూలక్ష్మి, పెనుమత్స రాఘవరాజు, సుబ్రహ్మణ్య కుమార్ ఏలేశ్వరపు, సుకాసి సరిత, తంబళ్లపల్లి రమాదేవి, తోటకూర వెంకట రమణారావు, తరిగొప్పుల పార్వతి, ప్రత్యేక ఆహ్వానితులు మార్తి రామబ్రహ్మం, వెలగపూడి శంకర్ బాబు హాజరై, స్వామివార్ల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమములో పాల్గొనటం తమకు భాగ్యం కలగడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు టిడిపి జిల్లా కమిటీలను ఖరారు చేయనున్న చంద్రబాబు
నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు టీడీపీ జిల్లా కమిటీలను ఖరారు చేయనున్న చంద్రబాబు  ...
By Rajini Kumari 2025-12-16 07:51:12 0 88
Andhra Pradesh
ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక !! 108 పిర్యాదులు !!
కర్నూలు :  పత్రికా ప్రకటన … (15.12.2025) కర్నూలు జిల్లా...విచారణ జరిపి...
By Hari Krishna 2025-12-15 12:03:37 0 148
Andhra Pradesh
కేంద్ర మంత్రి వి. సోమన్న సహకారంతో హిందూపురంలో వందే భారత్ నిలుపుదల: పచ్చజెండా ఊపిన ఎంపీ పార్థసారథి మరియు ప్రముఖులు
హిందూపురం ప్రాంత ప్రజల చిరకాల విజ్ఞప్తిని మన్నిస్తూ, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ వి....
By Venugopal Gopal 2025-12-27 09:52:45 0 1K
Andhra Pradesh
మదనపల్లిలో కరెంట్ షాక్: రైతుకు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి కరెంట్ షాక్ ఘటన చోటుచేసుకుంది. కోటవారిపల్లికి చెందిన పాండు (45)...
By Pagadala Venkateswar 2026-01-29 07:47:27 0 42
Andhra Pradesh
మదనపల్లెలో భూ మ్యుటేషన్లపై శిక్షణా కార్యక్రమం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం మదనపల్లెలో రెవెన్యూ సిబ్బందికి భూ మ్యుటేషన్లపై...
By Pagadala Venkateswar 2026-02-06 04:25:51 0 32
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com