దుర్గా మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ

0
149

ప్రకటన

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు చేనేత పట్టు వస్త్రాల సమర్పణ

విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఫిబ్రవరి 14:

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ మరియు మల్లేశ్వర స్వామి వార్లకు శనివారం ఉదయం పద్మశాలీ ప్రతినిధులు అత్యంత భక్తిశ్రద్ధలతో పట్టు వస్త్రాలను సమర్పించారు. రానున్న మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని, మంగళగిరి బహుత్తమ పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ విశేష కార్యక్రమం నిర్వహించబడింది.

శనివారం ఉదయం 11:25 గంటలకు ఆలయానికి చేరుకున్న సంఘ సభ్యులు, చేనేత కళాకారులు నైపుణ్యంతో రూపొందించిన మంగళగిరి పట్టు వస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ అధికారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంగళగిరి పద్మశాలీ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), సభ్యులు: అవ్వారు శ్రీనివాసరావు, మరియు గూడపాటి వెంకట సరోజినీ దేవి 

జీవీ నాగేశ్వరరావు, జింకా లక్ష్మీదేవి, మన్నె కళావతి, మోరు స్రావణి, పద్మావతి ఠాకూర్, పనబాక భూలక్ష్మి, పెనుమత్స రాఘవరాజు, సుబ్రహ్మణ్య కుమార్ ఏలేశ్వరపు, సుకాసి సరిత, తంబళ్లపల్లి రమాదేవి, తోటకూర వెంకట రమణారావు, తరిగొప్పుల పార్వతి, ప్రత్యేక ఆహ్వానితులు మార్తి రామబ్రహ్మం, వెలగపూడి శంకర్ బాబు హాజరై, స్వామివార్ల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమములో పాల్గొనటం తమకు భాగ్యం కలగడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో రెండు...
By Benguluri Madhubabu 2026-02-02 07:23:44 0 213
Andhra Pradesh
గోనెగండ్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కర్నూలు డిఐజి ఇంచార్జ్ ఎస్పి
కర్నూలు : కర్నూలు సిటీ :  గోనెగండ్ల  సర్కిల్ కార్యాలయాన్ని  ఆకస్మిక తనిఖీ చేసిన...
By Hari Krishna 2026-01-20 15:03:55 0 153
Andhra Pradesh
చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారింది......
చందోలు:  చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు మాయాజాలం. చందోలు ప్రాథమిక ఆరోగ్య...
By Gadiyapudi Narendra 2026-02-12 12:49:39 0 148
Andhra Pradesh
అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టా? వాస్తవాలు - అపోహలు....
సమాజంలో జరిగే విషయాలను సేకరించి, విశ్లేషించి ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రతి వ్యక్తీ జర్నలిస్టే....
By Gadiyapudi Narendra 2026-03-03 05:44:11 0 188
Telangana
సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
కొత్తగూడ, డిసెంబర్ 14(భారత్ అవాజ్): స్థానికల ఎన్నికలవేళ కొత్తగూడ మండలలో జోరుగా ఎన్నికల ప్రచారం...
By Bittu Bittu 2025-12-14 04:57:30 0 489
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com