Chandrababu Naidu: నర్సింగ్ అడ్మిషన్స్ .. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.

0
30

బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా 

వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు ఆమోదం

ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి సత్యకుమార్

బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా నిర్వహించాలని నిర్ణయించింది. 

 

వైద్యారోగ్య శాఖ సమర్పించిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం 2026 -27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఆ విద్యా సంవత్సరంలో నర్సింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా నీట్ –యూజీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. 

 

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, నర్సింగ్ ప్రవేశాల కోసం ఉత్తమ విధానాన్ని రూపొందించే దిశగా సమీక్ష చేపట్టారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని నర్సింగ్ అడ్మిషన్లు కేంద్ర ప్రమాణాలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

Search
Categories
Read More
Madhya Pradesh
NEET UG 2025 MP Counselling Starts Today
The second round of NEET UG 2025 counselling has begun in Madhya Pradesh. Candidates can check...
By Pooja Patil 2025-09-15 05:37:02 0 120
Bharat Aawaz
Beyond Gear and Gloss: The Unstoppable Journey of Candelaria Rivas Ramos
  CHIHUAHUA, MEXICO: While the world of sports often obsesses over carbon-plated shoes and...
By Venugopal Gopal 2026-01-04 17:01:11 0 1K
Andhra Pradesh
సితార సెంటర్ వద్ద వంగవీటి మోహనరంగా జంక్షన్ వద్ద ఘన నివాళి
ప్రజల మాటలు ప్రజల బాటలో నిలిచి ప్రయాణించిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా గారు.   ...
By Rajini Kumari 2025-12-26 09:45:14 0 107
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com