హనుమాన్ సుందరకాండ పారాయణం లో పాల్గొన్న ఎమ్మెల్యే

0
107

కర్నూలు : నంద్యాల : డోన్ : 

డోన్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతంగా, శాంతి సమృద్ధులతో ఉండాలని ఆకాంక్షిస్తూ గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు  శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి , డోన్ మాజీ ఎమ్మెల్యే  శ్రీమతి శ్ర కోట్ల సుజాతమ్మ నాల్గవ రోజు డోన్ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన శ్రీ హనుమాన్ సుందరకాండ పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా సుందరకాండ పర్యాయాన్ని రచించి గానం చేసిన  ఎం.ఎస్. రామారావు గారి మనవడు శ్రీ శ్రీనివాస్ స్వామిజీ  భక్తి శ్రద్ధలతో, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  హనుమంతుడిని ప్రత్యేకంగా ప్రార్థించి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం, శాంతి భద్రతలు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో గౌరవనీయులు డోన్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ కోట్ల సుజాతమ్మ ,శ్రీమతి శ్రీ కోట్ల నివేదితమ్మ ,  పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సుందరకాండ పారాయణం అనంతరం స్వామిజీ గారు ఆశీర్వచనాలు అందించగా, కార్యక్రమం భక్తి వాతావరణంలో ప్రశాంతంగా కొనసాగుతుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుపతి నగరపాలక సంస్థ చెత్త ‌సేకరణ
తిరుపతి నగరంలో చెత్త ‌సేకరణ లో స్వచ్ఛాంద్ర లో ప్రప్రథమం -స్వచ్చ తిరుపతిలో...
By Karapati Gopi 2026-01-01 10:12:38 0 243
Andhra Pradesh
Nagababu: కులం అనేది పుట్టుకతో వచ్చే విషయం, ఎంపిక చేసుకునేది కాదు: నాగబాబు.
జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు, వైసీపీ నేతలపై, ముఖ్యంగా ఆ పార్టీలోని కాపు నాయకులపై తీవ్రస్థాయిలో...
By Pagadala Venkateswar 2026-02-08 11:27:53 0 45
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి
పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న...
By Kothuru Murali 2026-02-03 05:13:55 0 40
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com