Perni Nani: పేర్ని నానికి నోటీసులు ఇవ్వండి: ఏపీ హైకోర్టు.
Posted 2026-02-13 06:51:44
0
142
చంద్రబాబు, పవన్ లను దూషించిన కేసు
పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను దూషించిన అంశానికి సంబంధించి మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పేర్ని నాని క్వాష్ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ ను నిన్న విచారించిన హైకోర్టు పేర్ని నానికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పేర్ని నానిపై నమోదైన కేసులు ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవేనని... క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 35(3) ప్రకారం ఆయనకు నోటీసులు ఇచ్చి, విచారణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. తదుపరి విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో రెండు...
తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక,
నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక,
సమైక్య సంకెళ్లను తెంచి...
Churu Court Delivers Verdict in Shocking 2022 Murder Case Involving Woman, Occultist
Churu (Rajasthan): In a chilling case that shook Rajasthan’s Churu district, the District...
Madanapalle: మదనపల్లె తట్టివారిపల్లి జంక్షన్లో తాలూకా ఎస్సై రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని తట్టివారిపల్లి జంక్షన్ వద్ద తాలూకా ఎస్సై...
అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుళ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ
15-12-2025
ప్రచురణార్ధం
అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన...