తిరుమలలో భక్తుల రద్దీ... అన్ని కంపార్టుమెంట్లు ఫుల్.

0
110

తిరుమలలో భక్తుల రద్దీ... అన్ని కంపార్టుమెంట్లు ఫుల్

13-02-2026 Fri 11:27 | Both States

 

టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఉన్నవారికి 5 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,632 మంది భక్తులు

 

వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన వారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. టోకెన్లు కలిగిన భక్తులు వారికి నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ సూచించింది.

 

నిన్న స్వామి వారిని 61,632 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 24,435 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల ద్వారా హుండీకి రూ. 3.28 కోట్ల ఆదాయం వచ్చింది.

Search
Categories
Read More
Telangana
మెదక్ జిల్లా గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి... సీఎం కప్పు ర్యాలీ నిర్వహణ... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా గ్రామీణ యువత పల్లె స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలని జిల్లా...
By Gangaram Rangagowni 2026-01-09 07:01:21 0 264
Telangana
కాగజ్ నగర్ లో 700 దేశీదారు భాటిళ్ల స్వాధీనం
కాగజ్ నగర్ మండలంలో శుక్రవారం అక్రమ మద్యం రవాణ పై పోలీసులు చర్యలు చేపట్టారు. మండలంలోని డాడ నగర్...
By Vangari Praveen 2026-05-01 10:18:07 0 230
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ప్రజా వేదిక పరిష్కారం ప్రధాన ఉద్దేశం కార్యక్రమం చేపట్టినారు.
గుంటూరు జిల్లా పోలీస్...* *తేదీ: 29.12.2025* _*//“ప్రజలకు సత్వర న్యాయం అందే విధంగా...
By KOTESWARARAO KVSR 2025-12-29 14:22:59 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com