తిరుమలలో భక్తుల రద్దీ... అన్ని కంపార్టుమెంట్లు ఫుల్.

0
25

తిరుమలలో భక్తుల రద్దీ... అన్ని కంపార్టుమెంట్లు ఫుల్

13-02-2026 Fri 11:27 | Both States

 

టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఉన్నవారికి 5 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,632 మంది భక్తులు

 

వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన వారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. టోకెన్లు కలిగిన భక్తులు వారికి నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ సూచించింది.

 

నిన్న స్వామి వారిని 61,632 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 24,435 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల ద్వారా హుండీకి రూ. 3.28 కోట్ల ఆదాయం వచ్చింది.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య మృతదేహానికి రిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్లు మంగళవారం ఒంగోలులో పోస్టుమార్టం నిర్వహించారు.
చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య...
By Gadiyapudi Narendra 2026-01-07 10:35:51 0 107
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్‌పై ముద్రగడ కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వ హయాంలోని అభివృద్ధిని జగన్ తట్టుకోలేకపోతున్నారన్న ముద్రగడ కుమార్తె క్రాంతి ...
By Pagadala Venkateswar 2026-02-04 07:42:22 0 37
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై బడ్జెట్ పత్రులకు ప్రత్యేక పూజలు
ప్రెస్ నోట్   తేదీ: 14 ఫిబ్రవరి, 2026 ఇంద్రకీలాద్రి.   ఇంద్రకీలాద్రిపై...
By Rajini Kumari 2026-02-14 14:35:25 0 61
International
EAM Dr. S. Jaishankar Meet US DNI Tulsi Gabbard in Washington DC .....
EAM Dr. S. Jaishankar: Delighted to meet US DNI Tulsi Gabbard in Washington DC this...
By Bharat Aawaz 2025-07-03 07:32:43 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com