కేంద్రంపై గళమెత్తిన కార్మికులు- అల్వాల్ లో భారీ నిరసన .|

0
206

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం అల్వాల్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్మికులు సమర శంఖం పూరించారు.

ఏఐటీయూసీ సహా పలు కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా అల్వాల్ లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

 

అల్వాల్ మీసేవ సర్కిల్ నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. వందలాదిమంది పారిశుద్ధ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మరియు ఇతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు.

 

 ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ... కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడం మరణ శాసనమని మండిపడ్డారు. ఈ కొత్త చట్టాల వల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని హైర్ అండ్ ఫైర్ పద్ధతి వల్ల కార్పోరేట్ సంస్థలకు లాభం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న 4 లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలి.

 

ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించరాదు.

 

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ. 2.6000 వేలు చెల్లించి వారిని క్రమబద్ధీకరించాలి... అని తెలిపారు.

 

 ఈ కార్యక్రమంలో.. మున్సిపల్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు, కే. రవి చందర్, TNTUC సీనియర్ నాయకులు ఆర్. చంద్రశేఖర్, AITUC జిల్లా నాయకులు, జి. మహేందర్, డి ఎం శేఖర్. బిజే శ్రీను, బి, నరేందర్, ఏ. బాబు, ఎం. సాయి కుమార్, పి.మురళి, కౌసర్, తిరుపతి, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

 

#SIDHUMAROJU 

ALWAL

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా అన్నదానం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె చౌడేశ్వరి సర్కిల్ సమీపంలోని నీరుగట్టువారిపల్లిలో ఉన్న శ్రీ నీలకంటేశ్వర...
By Pagadala Venkateswar 2026-02-16 11:01:53 0 314
Andhra Pradesh
పుంగనూరు: 450 సంవత్సరాల చరిత్ర గల గంగమ్మ జాతర మార్చి 10.11.
పుంగనూరులో ఈనెల 10, 11వ తేదీల్లో సుగుటూరు గంగమ్మ జాతరను నిర్వహిస్తున్నట్లు జమీందారులు మంగళవారం...
By Kothuru Murali 2026-03-04 06:58:18 0 139
Andhra Pradesh
పుంగనూరు: అదుపుతప్పి పొలాల్లోకి వెళ్లిన వాహనం
పుంగనూరు పరిధిలో శుక్రవారం రోజున ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి ముల్బాగల్ కు వెళ్లే...
By Kothuru Murali 2026-05-22 14:22:02 0 97
SURAKSHA
Amit Singla IAS: A Visionary Administrator Driving Good Governance
The Journey Begins "Good governance is not merely about policies—it is about ensuring that...
By Fathima Safa 2026-07-23 06:36:24 0 40
Andhra Pradesh
Chandrababu: తిరుమల వీధుల్లో నడుస్తూ.. భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.
సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కుమారుడైన దేవాన్ష్ జన్మదిన వేడుకలు...
By Pagadala Venkateswar 2026-03-21 06:21:24 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com