కాషాయ ముసుగులో కన్నింగ్ దొంగలు - వృద్ధులే లక్ష్యంగా చోరీలు .|

0
180

సికింద్రాబాద్.. ఆధ్యాత్మిక ముసుగులో పూజలు చేస్తామని నమ్మించి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్ ముఠాను వారాసిగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

నిందితుల నుండి ఐదు గ్రాముల బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వారాసిగూడ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపారు. మధ్యప్రదేశ్ కు చెందిన సుభాష్ నాథ్,కరణ్ నాథ్, సోహాన్ నాథ్ లు జీవనోపాధి కోసం హైదరాబాద్ పహాడ్ షరీఫ్ లో నివాసం ఉంటున్నారు. దృష్టిమరించి దొంగతనాలు చేయాలని పక్కా ప్రణాళిక తో కాషాయ వస్త్రధారణ లో స్వామీజీలుగా నమ్మబలుకుతూ లలిత నగర్ లో వృద్ధులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

మంచినీళ్ల కోసం ఇంట్లోకి వెళ్లి వారికి మాయ మాటలు చెప్పి శాంతి పూజలు చేస్తామని నమ్మించారు. శాంతి పూజలు ఉంగరాన్ని ఉంచాలని చెప్పి తీసుకుని నోట్లో మింగేసి అక్కడినుండి ఆటోలో పరారయ్యారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వారాసిగూడ పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా నిందితులను జల్ పల్లిలో గుర్తించి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: క్వాంటం వ్యాలీతో వచ్చే ఉద్యోగాలివే.. భవిష్యత్ టెక్నాలజీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.
అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ ఎలాంటి ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను...
By Pagadala Venkateswar 2026-02-08 11:20:53 0 132
Telangana
నూతన ITDA PO గా లెనిన్
ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారి (పీఓ) గా Lenin Vatsal Toppo నియామకం
By Bittu Bittu 2026-04-26 00:47:30 0 443
Telangana
ఆడబిడ్డల భద్రత కోసం సమాజం ఒక్కటిగా నిలుద్దాం.
అమనగల్ లో నిరసన ర్యాలీ ఉప్పల వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో ‎బాధిత బాలికకు న్యాయం జరగాలని,...
By Ponnala Srinivasrao 2026-05-15 02:57:07 0 64
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com