Vidyasagar: ఏపీ జేఏసీ చైర్మన్‌గా విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నిక.

0
112

అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలన్న విద్యాసాగర్

33 ఏళ్ల సర్వీస్ నిబంధనపై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి

ఈ అంశంపై అవగాహన లేని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న విద్యాసాగర్ 

 

ఏపీ జేఏసీ చైర్మన్‌గా ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని ఎన్జీవో హోంలో నిన్న నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు విద్యాసాగర్‌ను దుశ్సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

 

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, 33 ఏళ్ల సర్వీస్ నిబంధనపై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై అవగాహన లేని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

 

ఈ సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్ ప్రసాద్‌, డిప్యూటీ సెక్రటరీ జనరల్ డీవీ రమణతో పాటు నేతలు ఎం. రఘునాథరెడ్డి, జి. హృదయరాజు, బి. సాంబశివరావు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
"ఇప్పుడు ఇలా బోర్లు తవ్వితే… రేపు నీళ్లు దొరకవు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ డివిజన్‌లో అనుమతి లేని బోర్ల తవ్వకాలపై ప్రజల్లో ఆందోళన...
By Sidhu Maroju 2026-04-07 10:51:45 0 165
Andhra Pradesh
పుంగనూరు: నకిలీ సీళ్ల కేసులో ఐదుగురు అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లె విలేజ్ సెక్రటరీ సీళ్లను...
By Kothuru Murali 2026-03-24 13:41:26 0 118
Andhra Pradesh
వికసిత్ భారత్ లక్ష్యంగా వి.బి.జి రామ్ చట్టం–2025 పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
బాపట్లజిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన వి.బి.జి రామ్ చట్టం–2025 కు...
By Gadiyapudi Narendra 2026-03-02 13:39:09 0 193
Andhra Pradesh
మదనపల్లె: దారికాసి పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి.
శుక్రవారం మదనపల్లెలో పారిశుద్ధ్య కార్మికురాలిపై దారికాసి దాడి జరిగింది. కుమారపురానికి చెందిన...
By Pagadala Venkateswar 2026-05-22 12:34:00 0 36
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com