Vidyasagar: ఏపీ జేఏసీ చైర్మన్‌గా విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నిక.

0
84

అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలన్న విద్యాసాగర్

33 ఏళ్ల సర్వీస్ నిబంధనపై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి

ఈ అంశంపై అవగాహన లేని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న విద్యాసాగర్ 

 

ఏపీ జేఏసీ చైర్మన్‌గా ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని ఎన్జీవో హోంలో నిన్న నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు విద్యాసాగర్‌ను దుశ్సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

 

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, 33 ఏళ్ల సర్వీస్ నిబంధనపై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై అవగాహన లేని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

 

ఈ సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్ ప్రసాద్‌, డిప్యూటీ సెక్రటరీ జనరల్ డీవీ రమణతో పాటు నేతలు ఎం. రఘునాథరెడ్డి, జి. హృదయరాజు, బి. సాంబశివరావు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
స్కౌట్ శిక్షణతో క్రమశిక్షణ, బంగారు భవిష్యత్తు: ఎమ్మెల్యే.
మదనపల్లె హోప్ మున్సిపల్ హైస్కూల్‌లో బుధవారం జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సమావేశంలో...
By Pagadala Venkateswar 2026-03-12 03:32:00 0 82
Andhra Pradesh
Ambati Rambabu: అంబటి రాంబాబు అరెస్ట్.
Andhra Ambati Rambabu Arrested for Remarks Against Chandrababu Naidu సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యల...
By Pagadala Venkateswar 2026-02-01 08:36:16 0 81
Andhra Pradesh
దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం... బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు
దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం...బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి....
By Gadiyapudi Narendra 2026-01-12 16:43:42 0 147
Telangana
జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
మంచిర్యాల: జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి మంచిర్యాల కలెక్టరేట్ లో అధికారులు,...
By Pinnehasan Odela 2026-03-11 17:03:58 0 100
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com