Chandrababu Naidu: శివరాత్రి నేపథ్యంలో... ఏపీలోని శైవక్షేత్రాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.

0
152

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్న సీఎం చంద్రబాబు

దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచన

దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి వచ్చే భక్తులను ఎవ్వరూ అగౌరవంగా చూడకూడదని స్పష్టీకరణ

 

శివరాత్రి సందర్భంగా ఏపీలోని శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతుల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తీసుకుంటున్న చర్యలపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో నిన్న సీఎం ఢిల్లీ నుంచే సమీక్ష చేశారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. 

 

శివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న సీఎం.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, అవసరమైన వసతి సదుపాయాలు అందేలా కార్యాచరణ అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

 

దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి వచ్చే భక్తులను ఎవ్వరూ అగౌరవంగా చూడకూడదని స్పష్టం చేశారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. శివరాత్రి వంటి పర్వదినాల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
SDG లక్ష్యాలు 100% దాటాలి
గుంటూరు ఫిబ్రవరి 04: జిల్లాలో స్వర్ణాంధ్ర సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGs) సూచికలు నూరుశాతం...
By John Baji 2026-02-04 12:53:02 0 462
Maharashtra
Leading the Charge: Maharashtra’s VVIPs Pivot to EVs
In a significant push for green energy, Deputy CM Eknath Shinde officially transitioned his...
By Dunna Jessicaruth 2026-05-15 05:39:46 0 114
Telangana
వరంగల్ జిల్లా పాత MGM భవనాన్ని ఏం చేశారో....? మొదలైన చర్చ
భారత్ అవాజ్ న్యూస్:27 మే రోజున ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని...
By Gujile Ramu 2026-05-27 04:25:28 0 125
Andhra Pradesh
ప్రజా దర్బార్ లో సమస్యలు విన్న ఎమ్మెల్యే షాజహాన్ భాష.
మదనపల్లెలో సోమవారం జరిగిన ప్రజా దర్బార్ లో స్థానిక ప్రజలు తమ సమస్యలను మదనపల్లి శాసనసభ్యులు యం....
By Pagadala Venkateswar 2026-03-02 07:53:29 0 147
Telangana
Ex MLA ibrahimpatnam passes away
Kondigari Ramulu, the former MLA of Ibrahimpatnam, passed away on March 13, 2026, at the age of...
By G k Nookala 2026-03-13 16:57:26 0 343
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com