Chandrababu Naidu: శివరాత్రి నేపథ్యంలో... ఏపీలోని శైవక్షేత్రాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.

0
150

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్న సీఎం చంద్రబాబు

దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచన

దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి వచ్చే భక్తులను ఎవ్వరూ అగౌరవంగా చూడకూడదని స్పష్టీకరణ

 

శివరాత్రి సందర్భంగా ఏపీలోని శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతుల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తీసుకుంటున్న చర్యలపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో నిన్న సీఎం ఢిల్లీ నుంచే సమీక్ష చేశారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. 

 

శివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న సీఎం.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, అవసరమైన వసతి సదుపాయాలు అందేలా కార్యాచరణ అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

 

దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి వచ్చే భక్తులను ఎవ్వరూ అగౌరవంగా చూడకూడదని స్పష్టం చేశారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. శివరాత్రి వంటి పర్వదినాల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి CR పాటి తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ*...
By Rajini Kumari 2025-12-19 10:24:41 0 215
Telangana
Say no to drugs
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముఖ్యమంత్రి...
By G k Nookala 2026-06-26 04:40:28 0 102
Telangana
లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అందజేత.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలువురు పేదలు గత కొన్ని రోజులుగా...
By Sidhu Maroju 2025-11-28 16:20:20 0 216
Telangana
వేగంగా ఎస్‌ఐఆర్
ప్రతీ ఒక్కరూ SIR లో వివరాలు నమోదు చేసుకోవాలి జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరీష్ ...
By Bheeshman King 2026-06-30 13:55:23 0 105
Andhra Pradesh
పారిశుద్ధ్య ఇంజనీరింగ్ పార్కు కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలి
👉 పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, పార్కు కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించండి. 👉 రేపటిలోగా జీతాలు...
By Rajini Kumari 2026-04-20 14:33:04 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com