అంజుమన్‌ భూములను ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయం ఎదుట గుంటూరు వైఎస్సార సీపి నాయకులు «నిరసన వ్యక్తం చేశారు.

0
452

గుంటూరు జిల్లా మంగళగిరి చిన కాకానిలోని 71.5 ఎకరాల అంజుమన్‌ భూమిని ప్రైవేటీకరణను తక్షణమే విరమించుకోవాలని కోరుతూ మంగళవారం విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయం వద్ద గుంటూరు వైఎస్సార్‌ సీపి నాయకులు కార్యాలయం ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంజుమన్‌ హమారా.. హక్‌ హమారా అంటూ నినాదాల హోరెత్తించారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలంయలో బోర్డు సమావేశం జరుగుతున్న నేపథ్యంలో బోర్డు గుంటూరు అంజుమన్‌ భూమికి సంబంధించి 71.5 ఎకరాల భూమికి సంబంధించి ఐటీ పార్క్‌ నిర్మాణంకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ ధర్నా నిర్వహించారు. వక్ఫ్‌ బోర్డు సమావేశం అనంతరం బయటకు వచ్చిన గుంటూరు అంజుమన్‌ అధ్యక్షుడు, వక్ఫ్‌బోర్డు డైరెక్టర్, గుంటూరు తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే నసీర్‌ అహమ్మద్‌ వైఎస్సార్‌ సీపి నాయకులు అడ్డగించి బోర్డు సమావేశంలో ఏమి తెల్చారో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. మరలా అఖిల పక్ష సమావేశం నిర్వహించి చెబుతానంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఈ సంధర్భంగా వైఎస్సార్‌ సీపి రాష్ట్ర కార్యదర్శి, షేక్‌ గులాం రసూల్‌ తూర్పు నియోజక వర్గ ఇన్‌చార్జి నూరీ ఫాతిమా, ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ నాయకులు, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర కోశాధికారి అబ్దుల్ కలాం మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు సద్దాం ఖాన్, మహమ్మద్ ఆయాజ్ , సయ్యద్ సర్తాజ్ అహ్మద్, నసీమా, మరియు గుంటూరు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ భాయ్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం , నూర్ ఖాన్,రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయం ముందు జరిగిన ధర్మ లో తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా!
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా! తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో...
By Pinnehasan Odela 2026-04-08 13:32:29 0 176
Andhra Pradesh
పోగొట్టుకున్న లక్ష రూపాయలు సొమ్ము తిరిగి ఇచ్చిన అర్చకులు సాయిరాం
  నందిగామ ఎన్టీఆర్ జిల్లా  డబ్బులు, విలువైన వస్తువులు దొరికితే తమ సొంతం...
By Patan Khuddus 2026-04-17 05:39:43 0 212
SURAKSHA
ప్రమాద రహిత రోడ్లే లక్ష్యం: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు నిరంతరం తనిఖీలు...
By Kalaga Sailaja 2026-06-25 06:47:13 0 38
Lakshdweep
Lakshadweep Ends 47-Year Prohibition: A New Tourism Era
he Union Territory of Lakshadweep has officially entered a transformative chapter with the...
By Lokeshwari Panthadi 2026-06-29 05:00:38 0 67
Telangana
నిజామాబాద్: మామిడిపల్లి జాతీయ రాహదరిపై రోడ్డు ప్రమదం
ఆర్మూర్ పట్టానమ్లోని మామిడిపల్లి 44 వ జాతీయ రాహదరిపై బైకును కారు డికోనా ఘటానాలో ఒకారు మరనిచగా...
By Sadaq Sadaq 2026-04-23 01:59:41 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com