పోగొట్టుకున్న లక్ష రూపాయలు సొమ్ము తిరిగి ఇచ్చిన అర్చకులు సాయిరాం

0
212

 

నందిగామ ఎన్టీఆర్ జిల్లా 

డబ్బులు, విలువైన వస్తువులు దొరికితే తమ సొంతం చేసుకుంటారుగానీ, పోగొట్టుకున్న వ్యక్తులకు వాటిని అప్పగించాలని ఆలోచించరు. వాటిని చూడగానే మనిషి ప్రవర్తన మారిపోతుంది. కానీ, కొందరు మాత్రం తమది కానిది ఒక్క రూపాయి కూడా ఆయాచితంగా తీసుకోడానికి ఇష్టపడరు. పరుల సొమ్ముకు ఆశపడకుండా ఆత్మాభిమానంతో ఉంటారు.

తాజాగా, అలాంటి సంఘటన గురువారం సాయంత్రం నందిగామ శివారు గ్రామీణ ప్రాంతంలో చోటుచేసుకుంది 

నందిగామ మండలం రాగాపురం నివాసి రుద్రవరం గొర్రెలు కొనడానికి వెళ్లి వస్తూ ఉండగా లక్ష రూపాయల బ్యాగును పోగొట్టుకున్నాడు. ఇంటికి వెళ్లి బ్యాగు లేకపోయేసరికి ఎక్కడ పోగొట్టుకున్నాడో తెలియక బాధపడుతూ ఉన్నాడు.

కానీ ఆ రాత్రి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గొల్లమూడి శివాలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న తొర్లపాటి సాయిరాం కు 1 లక్ష రూపాయలు బ్యాగు రోడ్డుపై  దొరికింది.

వెంటనే అర్చకులు సాయిరాం గొల్లమూడి శివాలయం గ్రూపులో ఈ సమాచారాన్ని అందించారు సమాచారం తెలుసుకున్న బాధితులు గొల్లమూడి శివాలయం అర్చకుల్ని సంప్రదించారు.

శుక్రవారం ఉదయం నందిగామ వినాయకుడి గుడి అర్చకులు ప్రధాన అర్చకులు ఐతపు రఘు శర్మ బాధితులని నందిగామకు పిలిపించి నందిగామ పట్టణ సిఐ ను సంప్రదించి పూర్తి వివరాలు తెలపగా పట్టణ సీఐ ఆదేశాల మేరకు నందిగామ వినాయకుడు ఆలయంలో చైర్మన్ తిరుపతిరావు ఆధ్వర్యంలో గొల్లమూడి శివాలయం ప్రధాన అర్చకులు చేతుల మీదుగా పోగొట్టుకున్న సొమ్ము నగదు 1 లక్ష రూపాయలు రాఘవపురం నివాసి అయిన వరద పైన మురళీకృష్ణ కు అప్పగించారు.

 

పోయిందనుకున్నా లక్ష రూపాయలు సొమ్ము తిరిగి వచ్చేసరికి అర్చకులు సాయిరాం నిజాయితీకి ఫిదా అయ్యాడు. నందిగామ పాత బస్టాండ్ వినాయకుడి గుడి ఆలయంలో భక్తులంతా సన్నివేశాన్ని చూసి సాయిరాం నిజాయితీకి ప్రశంసలు కురిపించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం కందూరులో వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
సోమల మండలం, కందూరు గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. వేద పండితుల...
By Kothuru Murali 2026-03-27 14:36:21 0 161
Telangana
పెరగనున్న ఎంపీ ల సంఖ్య.. జీతాల ఖర్చు..?
డిలిమిటేషన్ తరువాత ఎంపీ ల సంఖ్య 850 కి చేరేఅవకాశం ఉంది.ప్రస్తుతం ఒక్కో సభ్యుని వేతనం₹1.24...
By MERIGE MALLESH 2026-04-17 07:34:12 0 1K
Andhra Pradesh
మదనపల్లె: రూ. 21 కోట్లతో తాగునీటి పనులు.. MLA, జేసీ భూమి పూజ.
మంగళవారం, ఎమ్మెల్యే షాజహాన్ భాషా తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లె ప్రజల తాగునీటి దాహాన్ని...
By Pagadala Venkateswar 2026-05-27 06:10:37 0 71
Telangana
గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన  నీలం స్వరూప కుమారుడు క్రాంతి నూతన...
By Pindikura Mahesh 2026-06-26 03:06:35 0 267
Andhra Pradesh
ఉమ్మడి చిత్తూరు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నల్లారి వ్యాఖ్యలు.
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాల విభజన వల్ల ప్రజలు, అధికారులు ఇబ్బందులు...
By Pagadala Venkateswar 2026-06-25 05:47:35 0 48
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com