వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ.

0
79

మదనపల్లె మండలం, కోళ్ళబైలు పంచాయితీ, అమ్మచెరువుమిట్టలోని వెలుగు వృద్ధాశ్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో డాక్టర్ టీ నాగజ్యోతి ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగజ్యోతి మాట్లాడుతూ ఆయుర్వేదం తల్లిపాలు వంటిదని, అందులో కల్మషం ఉండదని తెలిపారు. వృద్ధులకు సీజనల్ వ్యాధులకు అనుగుణంగా మందులు అందించారు. వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, డాక్టర్ నాగజ్యోతికి కృతజ్ఞతలు తెలిపి, మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. అనంతరం డాక్టర్ నాగజ్యోతిని శాలువాతో సత్కరించి, మొమెంటో అందజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు వాహనదారులు ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్న ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ఆకతాయిలపై గుంటూరు రేంజ్ ఐజి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాటి కట్టిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
*గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 24.12.2025* _*//*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *తేది...
By KOTESWARARAO KVSR 2025-12-24 15:35:27 0 199
Andhra Pradesh
100 ఎకరాలలో టీటీడీ వారి దివ్య వృక్షాల ప్రాజెక్ట్ :
కర్నూలు : 100 ఎకరాలలో దివ్య దృష్టి ప్రాజెక్ట్ టీటీడీ (TTD) వారు దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ను...
By Hari Krishna 2025-12-14 14:03:45 0 217
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com